PS Telugu News
Epaper

“కుటుంబంలో విషాదం – ప్రేమ వివాహం అడ్డుకట్టగా మారిన తండ్రి కోపం!”

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :.సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కూతురు ప్రేమ వివాహం నచ్చక… ఓ తండ్రి అల్లుడి ఇంటికి నిప్పు పెట్టాడు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని కక్కర్​వాడ లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన బోయిని నగేష్ ను అదే గ్రామానికి చెందిన గొల్ల విఠల్​ కూతురు ప్రేమ వివాహం చేసుకుంది. కూతురు ప్రేమ వివాహం చేసుకోవడం నచ్చని విఠల్​ కొడుకు పాండుతో కలిసి యువకుడి తండ్రి రాములుపై దాడి చేశాడు.ఈ క్రమంలో అల్లుడి ఇంటికి తండ్రీకొడుకులు నిప్పు పెట్టారు. స్థానికులు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పి, పరిస్థితిని అదుపు చేశారు. నగేష్​ పిర్యాదు మేరకు తండ్రి కొడుకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top