
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ మే 31
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని కుమ్మూరు గ్రామంలో సుమారు నెలరోజులుగా కుమ్మూరు యువత క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్లో సుమారు 60 టీములు పాల్గొనగా ఈరోజు చింతూరు యూ ఎఫ్ సి మరియు ఆర్కూర్ ఫైనల్ కు చేరుకున్నాయి. మొదట ఆర్ కురువారు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది. చింతూరు యూ ఎఫ్ సి టీం 138/6 నిర్దేశ 15 ఓవర్లలో రన్స్ చేయగా 139 విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్కూర్ టీం 78 పరుగులు వద్ద 13వ వార్లలో ఆల్ అవుట్ అవ్వడం జరిగింది. చింతూరు యు ఎఫ్ సి టీం టోర్నమెంట్ విజేతగా నిలిచింది. ఈ టోర్నమెంట్ లో మొదటి బహుమతి 70 వేల రూపాయలు చింతూరు యు.ఎఫ్.సి గెలుచుకున్నారు. తనరప్ప మిగిలిన ఆర్కుర్ టీం కి 40 వేలు ద్వితీయ బహుమతి కుమ్మూరు టోర్నమెంట్ నిర్వాహకులు అందజేశారు..ఇదిలా ఉండగా ఇటీవలే ప్రమాదవశాస్తూ సీలేరు నదిలో గల్లంతై మరణించిన నాగుల దిలీప్ కుమార్ అనే క్రీడాకారుడికి చింతూరు యు ఎఫ్ సి టీం వారు తమ మొదటి బహుమతిని మొత్తం 70 వేల రూపాయలు దిలీప్ కుటుంబానికి అందజేశారు. స్నేహానికి మించింది లేదు అని అన్నిటికన్నా స్నేహమే గొప్ప అని చింతూరు యువత మరొకసారి నిరూపించారు.. చింతూరు యువత క్రీడాకారులు మాట్లాడుతూ మేమందరం కుమ్మూరు క్రికెట్ టోర్నమెంట్ విజయం విజయం సాధించామంటే దిలీపే మమ్మల్ని దగ్గరుండి గెలిపించాడు అని దిలీప్ మాతో భౌతికంగా లేకపోయినా ఎప్పుడూ మాతో చిరస్థాయిగా నిలిచిపోతాడని క్రీడాకారులు పేర్కొన్నారు.

