
కేసీఆర్ గారిని బద్నామ్ చేయాలనే ప్రయత్నమే ఈ కాంగ్రెస్ కాళేశ్వరం కమిషన్
ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి పట్ల వ్యవహారిస్తున్న తీరుని తెలంగాణ సమాజం గమనిస్తుంది
సరైన సమయం కోసం ప్రజలు వేచి చూస్తున్నారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
( పయనించే సూర్యుడు జూన్ 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
కాళేశ్వరం కమిషన్ విచారణ లో భాగంగా బీఆర్కే భవన్ కు హాజరైన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసిన తర్వాత ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి కేసీఆర్ ని కలిశారు.తెలంగాణ రాష్టాన్ని సాధించిపెట్టిన మీపట్ల రేవంత్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహారిస్తున్న తీరును తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తుందని,తెలంగాణ ప్రజలు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారని ఆ సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ్తానికి బుద్ధిచెప్పాడనికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ తో కలిసిన సందర్బంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు.