
ఆదివాసి సంక్షేమ పరిషత్ డిమాండ్….
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ జూన్ 2
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం లో ప్రభుత్వం కూల్చివేస్తున్న అక్రమ కట్టడాలపై సోమవారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్(274/16) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మాట్లాడుతూ, కొలతలతో సంబంధం లేకుండా ఏజెన్సీ మండల కేంద్రంలో మరియు గ్రామాలలో రోడ్డు ప్రక్కన అదే విధంగా ఆదివాసి భూముల్లో అక్రమ కట్టడాలు కట్టి స్థిర నివాసాలు ఏర్పరచుకొని వ్యాపారం చేస్తున్నటువంటి నాన్ ట్రైబల్ కట్టడాలన్నిటిని తొలగించాలని ఆయన ప్రభుత్వాన్ని ,అధికారులని డిమాండ్ చేశారు. కొలతలతోటి కూల్చి వేయడం వలన ఇంకా చాలా అక్రమ కట్టడాలు మిగిలిపోతున్నాయని, వాళ్లందరూ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రోడ్డు మీదకు వచ్చి మళ్లీ అక్రమ కట్టడాలు కట్టి వ్యాపారాలు మొదలు పెట్టే అవాశం ఉందని,కాబట్టి కొలతలతో సంబంధం లేకుండా అక్రమ కట్టడాలను పూర్తిగా కూల్చి వేయాల్సిందే ఆని ఆయన అన్నారు. పలుచోట్ల అక్రమ కట్టడాలు సగం సగం పోతున్నాయని సగం పోయిన అక్రమ కట్టడం మిగిలిపోయిన అక్రమ కట్టడాన్ని ఎందుకు వదిలేస్తున్నారో అర్థం కావట్లేదు అని, అక్రమ కట్టడం అంటే అక్రమ కట్టడమే అని వాటిని పూర్తిగా తొలగించాల్సిందేనని ఆయన ప్రభుత్వానికి కోరారు. అదేవిధంగా మైదాన ప్రాంతాల నుంచి ఏజెన్సీకి వచ్చి వ్యాపారాలు చేస్తున్నటువంటి నాన్ ట్రైబల్స్ అందరూ స్వచ్ఛందంగా వారి సొంత గ్రామాలకి, పట్టణాలకు వెళ్లిపోవాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో అల్టిమేట్ జారీ చేశారు. అలా చేయకుంటే ప్రభుత్వ అధికారులు కాదు ఆదివాసులే స్వయంగా కూల్చాల్సి వస్తుందని ఏజెన్సీ నుంచి నాన్ ట్రైబల్స్ ని తరిమికొట్టేస్తారని హెచ్చరించారు. ఆదివాసులందరూ గాంధీయవాదులని వారి అమాయకత్వంతో ఎవరికైనా ఆశ్రయం కల్పిస్తారని దాన్ని అదునుగా చేసుకొని 1/70 చట్టాన్ని ఉల్లంఘించి ఎంతోమంది మైదాన ప్రాంత గిరిజన యేతరులు 1970 నుంచి ఎద్దేచ్ఛగా విచ్చలవిడిగా ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి వ్యాపారాలు కొనసాగిస్తూ ఇక్కడే భూములు ఆక్రమించి స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారని అన్నారు. ఆదివాసుల సహనాన్ని పరీక్షించాలని చూస్తే భవిష్యత్తులో గిరిజనేతరులకు దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని దయచేసి ఏజెన్సీ ఆక్రమాదారులందరూ వాళ్ళ సొంత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆయన తెలియజేశారు. ఏజెన్సీలో గిరిజన యేతరుల వలసలు, వ్యాపారాలు వలన ఆదివాసి సంస్కృతి ( భాష, సాంప్రదాయం, ఆచారం, కట్టుబాట్లు ) పూర్తిగా దెబ్బ తినడమే కాకుండా ఆదివాసీలు సొంత గడ్డపై ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాల్సి వస్తుందని ఇది ఆదివాసుల ఆత్మగౌరవానికి గొడ్డలి పెట్టు వంటిదని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. ఆదివాసుల ఉనికి భావితరాల భవిష్యత్తు మనుగడ కోసం ఆదివాసి సంక్షేమ పరిషత్ అలుపెరుగని పోరాటం చేస్తుందని ఆదివాసులు కూడా గిరిజనేతలకు బినామీలుగా మారి వాళ్లకి భూములు ఇవ్వడం మానుకోవాలని లేకుంటే ఆదివాసులకే పుట్టగతులు లేకుండా పోతాయని , చివరికి నిలవనీడ కూడా ఉండదని గిరిజన యేతరులకు పూర్తిగా బానిసలు అవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికే జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు కొట్టేయడం వలన ఆదివాసీలు ఉద్యోగ ఉపాధి కల్పనకు దూరమైపోయారని, 1/70 చట్టాన్ని రక్షించుకొని గిరిజయేత్రుల ఆక్రమాలను, వలసలను అరికట్టకుంటే మరింత ప్రమాదం వాటిలే అవకాశం ఉందని ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆక్రమణ తొలగింపుకు యావత్తు ఆదివాసులంతా మద్దతు పలకాలని అండగా ఉండాలని పిలుపునిచ్చారు. అధికారులు కూడా కొలతలతో సంబంధం లేకుండా పలస వచ్చిన గిరిజన యేతరుల పక్కా భవనాలు వ్యాపార దుకాణాలు తొలగించాల్సిందేనని కోరారు. కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు తీగల బాబూరావు రంపచోడవరం డివిజన్ అధ్యక్షులు మొడిధ నూక రాజు, పీట ప్రసాదు, ముర్ల పురుషోత్తం , నేమల పురి రాములు. తదితులు పాల్గోన్నారు.