
పయనించేసూర్యుడు;వాజేడు జూన్ 16: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి.ఎ.
వాజేడు: ములుగు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్ రావు, క్షయ నియంత్రణ కార్యక్రమం అధికారి చంద్రకాంత్, ఆదేశాలతో వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ గ్రామాలవారీగా అనుమానిత ప్రజలను గుర్తించి క్షయ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.అనుమానితులను గుర్తించి 25 మందికి తెమడ శాంపిల్స్ సేకరించరు గ్రామాలలో ఆశా కార్యకర్తలు ముందు రోజే అనుమానితులకు సమాచారం అందించి వారికి డబ్బా ఇచ్చి ఉదయమే బ్రష్ చేయకముందే 6 గంటలకు తెమడను తీయాలని ఆశా కార్యకర్తలు ప్రజలకు సమాచారం అందించారు.శిబిరానికి వచ్చిన ప్రజలకు వాజేడు వైద్య అధికారి మహేందర్, క్షయ వ్యాధి గురించి అవగాహన కల్పించరు. లక్షణాలు గురించి మొదటిగా జ్వరం రావడం ఆకలి మందగించడం దగ్గు. ఆయాసం బరువు తగ్గుట
సాయంకాలం జ్వరం రావడం. అటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తులు వైద్యశాలకు రావాలని వ్యాధి నిర్ధారణ నుండి ఆరు నెలలు మందులు క్రమం తప్పకుండా వాడాలని వైద్య అధికారి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమలో వైద్య అధికారి కొమరం మహేందర్, హెల్త్ సూపర్వైజర్స్. వెంకటరమణ. కోటిరెడ్డి హెల్త్ అసిస్టెంట్స్. చిన్న వెంకటేశ్వర్లు. ఎల్ టి రజినీకాంత్,రోగులు పాల్గొన్నారు.
