
క్షయ వ్యాధి పై అవగాహన సదస్సు.
పయనించే సూర్యుడు: మార్చి 24: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి. ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వాజేడు లో ములుగు జిల్లా డి ఎం హెచ్ ఓ, గోపాల రావు మరియు పి ఓ, టీబీ ఆర్ డాక్టర్ చంద్రకాంత్ ఆదేశాల మేరకు వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ మహేందర్ ఆధ్వర్యంలో సోమవారం
వాజేడు మండల కేంద్రంలో మరియు పేరూరు వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మార్చి 24 అంతర్జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన దినం కొరకు మండల కేంద్రంలో ర్యాలీ మరియు సమావేశం నిర్వహించారు . ఈ సమావేశంలో డాక్టర్ మహేందర్ మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు ఉన్న ,ఛాతిలో నొప్పి ఉన్న తెమడలో రక్తం ఉన్న సాయంత్రం పూట జ్వరం వచ్చిన రాత్రిపూట చెమటలు పట్టిన బరువు తగ్గిన వెంటనే తెమడ పరీక్ష చేయించుకోవాలని తెలియజేశారు . ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ప్రతి పంచాయతీని టీబీ రహిత పంచాయితీగా తీర్చి దిద్దాలని, ప్రతి ఆశా కార్యకర్త మరియు ఆరోగ్య కార్యకర్తలు క్షేత్రస్థాయిలో వ్యాధులకు గురయ్యే వర్గం నుంచి నిబద్ధత తో నమూనాలు సేకరించి, కేసులను గుర్తించి చికిత్స చేసి టీబీ రహిత వాజేడు మండలంగా తయారు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మహేందర్, మరియు డాక్టర్ మధుకర్, మరియు డాక్టర్ యోషిత , డాక్టర్ గ్యానస , హెచ్ ఐఈ ఓ, వేణుగోపాలకృష్ణ, హెల్త్ సూపర్వైజర్ కోటి రెడ్డి , పి హెచ్ సి,నోడల్ పర్సన్ శ్రీను , శేఖర్ , తిరుపతి నాగేంద్ర కుమారి ,సత్యనాగవేణి , అనుషా ఎస్ ఎన్ , ఛాయాదేవి, రాజేశ్వరి కన్యాకుమారి పాల్గొన్నారు.
