
పయనించే సూర్యుడు జూన్ 12 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి :మండల వ్యవసాయ అధికారి. ఎన్. అన్నపూర్ణకు అఖిలభారత ఐక్య రైతు సంఘం(AIuks) మండల కమిటీ ఆధ్వర్యంలో మెమోరాడం ఇవ్వటం జరిగింది, ఈ సందర్భంగా. అఖిలభారత ఐక్య రైతు సంఘం(,AIuks), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు. బుర్ర వెంకన్న మాట్లాడుతూ.
ఈ సంవత్సరం రాష్ట్రంలో ఖరీఫ్ సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ పరికరాలు, వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, పాత రుణాలు మాఫీ చేయాలని, రైతు భరోసా. కవులు రైతులకు. పోడు భూములకు. కూడా. వెంటనే చెల్లించాలని, రబి సీజన్ నాటి పెండింగ్ సన్న ధాన్యం బోనస్ వెంటనే చెల్లించాలని, స్వామి నాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం కనీస మద్దతు ధరలు నిర్మించాలని, ఎం. ఎస్ .పి. కి చట్టబద్ధత కల్పించాలని, సమగ్ర పంటల బీమా వెంటనే ప్రతిపాదించి అమలు చేయాలని, నకలి విత్తనాలను అరికట్టాలని, సాగులో ఉన్న పోడు సాగుదారులందరికీ పట్టాలు ఇవ్వాలని, డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో, అఖిలభారత ఐక్య రైతు సంఘం,( AIuks) టేకులపల్లి మండల కార్యదర్శి.B. పంతులు మండల నాయకులు.B. లింగ. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్. డివిజన్ నాయకులు. జరుపుల సుందర్. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల నాయకులు. ఏనుటి నాగయ్య. తదితరులు పాల్గొన్నారు