Tuesday, August 12, 2025
Homeఆంధ్రప్రదేశ్గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలను గుట్కాలను నిషేధించాలి*సిరికొండ ఎస్ఐ కి వినతిపత్రం

గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలను గుట్కాలను నిషేధించాలి*సిరికొండ ఎస్ఐ కి వినతిపత్రం

Listen to this article

పయనం చే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా సిరికొండ మండలం

కొంకటి ఆశిష్ పి వై ఎల్ రాష్ట్ర కమిటీ సభ్యులు

ప్రగతిశీల యువజన సంఘం పి వై ఎల్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలు గుట్కాలు వెంటనే అరికట్టా లని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అనంతరం సిరికొండ ఎస్సై కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా పి వై ఎల్ రాష్ట్ర కమిటీ సభ్యులు కొంకటి ఆశిష్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా యువత మత్తుకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు డ్రగ్స్ గంజాయి మాఫియా విచ్చలవిడిగా గ్రామాలను సైతం వదలకుండా చదువుకునే విద్యార్థుల నుండి వృద్ధులను వదలకుండా మత్తుకు అలవాటు చేస్తున్నారు దీనితో వారి కుటుంబం జీవితాలు చిన్నభిన్నం అవుతున్నాయి నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి మన మండలంలో క్రమంగా విస్తరిస్తున్నాయి వీటిని అరికట్టడానికి ఇప్పటికే పోలీస్ అధికారి ఎస్సై కార్యక్రమాలు చేపట్టారు వారిని అభినందిస్తున్నము ఇంకా సంబంధిత శాఖకలు ప్రభుత్వ ప్రత్యేక బృందాలు నిలబెట్టి అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఈ కార్యక్రమంలో వై ఎల్ సిరికొండ మండల సభ్యులు బి.అక్షయ్, ఎం.ప్రణీత్, పండరి, నరేష్, సుమన్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments