Friday, April 18, 2025
Homeఆంధ్రప్రదేశ్గిరిజన యువకుడి దారుణహత్య

గిరిజన యువకుడి దారుణహత్య

Listen to this article

గొడ్డలితో నరికి చంపిన దుండగులు


పయనించే సూర్యుడు:ఏప్రిల్09: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి. ఎ.

వాజేడు:ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త టేకులగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువకుడు వాసం విజయ్ 28 సంవత్సరాలు గుర్తు తెలియని దుండగులు తలపై గొడ్డలితో మోది అతి దారుణంగా హత్య చేశారు ఈ సంఘటన వివరాలు తెలుసుకున్న వెంకటాపురం సిఐ బండారి కుమార్ పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. తదనంతరం కుటుంబ సభ్యుల నుండి వివరాలు సేకరించి విచారణ ప్రారంభించారు గుర్తు తెలియని వ్యక్తులు ఇంతటి దారుణానికి ఒడిగట్టడంతో టేకులగూడెం గ్రామంలో అలజడి మొదలైంది ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హత్య పైన పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments