Thursday, June 19, 2025
Homeఆంధ్రప్రదేశ్గురుకుల పాఠశాలలో వైద్య శిబిరం

గురుకుల పాఠశాలలో వైద్య శిబిరం

Listen to this article

ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత అవసరం

వైద్య అధికారి కందుల దినేష్

పయనించే సూర్యుడుజూన్ 18 (పొనకంటి ఉపేందర్ రావు)

బుధవారం టేకులపల్లి లోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే బాలుర హాస్టల్ లో సులానగర్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారి కందుల దినేష్ నేతృత్వంలోని వైద్య బృందం వైద్య శిబిరం నిర్వహించి పిల్లలకు చికిత్స అందించడం జరిగింది.పిల్లలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించడం జరిగింది ఎవరైనా వ్యాధులకు దూరంగా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం చక్కటి పోషకాహారం తీసుకోవడం ఆరోగ్యకరమని అలాగే పిల్లలు ఆహారం తీసుకునే ముందు మరియు మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత విధిగా చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలని, హాస్టల్లో తయారుచేసి అందించే ఆహారం మాత్రమే తీసుకోవాలని బహిరంగ ప్రదేశాల్లో అమ్మే ఆహార పదార్థాలను తీసుకోవద్దని సూచించారు. అనంతరం ప్రపంచ యోగ దినోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు మరియు ఉపాధ్యాయ సిబ్బందికి యోగా ప్రాముఖ్యతపై వివరించి వారి చేత యోగాసనాలు వేపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్యాధికారిణి విజయ శ్రీ, ఆరోగ్య విస్తరణ అధికారి దేవా, ఆయుష్ ఫార్మాసిస్ట్ రజిత, ఉపాధ్యాయులు సరిత,సుప్రియ, మెహబూబీ, వెంకన్న, నరసింహమూర్తి ,వెంకటనారాయణ, స్టాఫ్ నర్స్ రేష్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments