
పయనించే సూర్యుడు// న్యూస్ మే 21//మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప//
హైదరాబాద్ లో గత ఆదివారం జరిగిన గుల్జార్ హౌజ్ లో అగ్ని ప్రమాదంలో దాదాపుగా 17 మంది చనిపోయాడం జరిగింది ఇట్టి భవనాన్ని పరిశీలించి , మృతుల కుటుంబాలను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి కొత్తకోట సీతాదయాకర్ రెడ్డి ప్రభుత్వం తరుపున మృతుల కుటుంబాలను అన్నివిధాల అందుకుంటాము అని అలాగే మృతులకు తగిన పరిహారం చెల్లిస్తామని ఇట్టి ప్రమాదం గల కారణాలను సీఎం రేవంత్ రెడ్డి కి తెలియజేసి ఇటువంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని ప్రభుత్వం తరఫున తను హామీ ఇస్తున్నాను అని అంటూ అట్టి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తగిన పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చిన ఆమె! ఇట్టి ప్రమాదంలో ఎక్కువగా బాలబాలికలు మృతు వాటా పడడం తనను ఎంతో కలచివేసింది అని సీతాదయాకర్ రెడ్డి తెలిపారు.
