
చేనేత కార్మికులను సన్మానిస్తున్న దృశ్యం…
రుద్రూర్, ఆగస్టు 7 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు సుప్పల స్వామి, మామిడి పండరి, నూత్పల్లి నాగమణిలను శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం అధ్యక్షులు మోత్కూరి నారాయణ, ఉపాధ్యక్షులు గోనే దత్తాత్రి , డైరెక్టర్లు గంగుల శంకర్, పుల్లె లక్ష్మి, ఎన్.గణేష్ , మాజీ డైరెక్టర్ జువ్వల పోతన్న, షికారి గంగాధర్, ఈర్వ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.