
పరిశుభ్రత పై అవగాహన కల్పిస్తూ ఆరోగ్యం పై అవగాహన.
పయనించే సూర్యుడు: జూన్ 26; ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి.ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం లోని మొరూమురు పంచాయితీ పరిధిలోని ఘనపురం కాలనీ గ్రామంలో వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ మహేందర్ ఆధ్వర్యంలో ఇంటింటా ఆరోగ్య సర్వే నిర్వహిస్తూ వర్షాకాలం లో వచ్చే వ్యాధులపై అవగాహన కల్పిస్తూ అనారోగ్యంతో బాధ పడుతున్నవారికి చికిత్స అందజేశారు. అనంతరం గ్రామం లోని క్షుణ్ణంగా పరిశీలించి పరిసర ప్రాంతాలలో శుభ్రత పాటించడం విషయాలు వివరించారు.ఈయొక్క కార్యక్రమం లో భాగంగా ఇంటింటా జ్వరం సర్వే నిర్వహిస్తూ, గ్రామంలోనీ మధ్యలోగల కుర్సం సోమరాజు, పెద్దపల్లి మల్లయ్య ఇండ్ల మధ్యలో కాలి ప్రదేశంలో వర్షపు నీరు పేరుకోపోయి ఉందనీ పంచాయతీ కార్యదర్శి కి తెలియజేసి, అందులో ఆయిల్ బాల్స్ ని నీటిలో వేయడం జరిగిందనీ తెలియజేశారు.అంతేకాకుండా
మీసాల రత్నమ్మ జ్వరం, హైపొపోలిమియ మరియు లోబిపి ఉండటం తో మందులు ఇచ్చి చికిత్స అందించామని తెలిపారు.అంతేకాకుండా గర్భవతులకు తీసుకోవలసిన జాగ్రత్తలపై వివరించామని తెలిపారు. గ్రామంలో ని ప్రతిఒక్క ప్రాంతాన్ని గమనిస్తూ పరిసరాల పరిశుభ్రత పాటించాలనీ నిల్వ నీరు ఉంచ కూడదని, వైరల్ ఫీవర్ లాంటి వస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి కి వచ్చి వైద్యం చేయించుకోవాలని వివరించారు.ఈయొక్క కార్యక్రమంలో వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ మాహిందర్, హెల్త్ సూపర్వైజర్ కోటిరెడ్డి మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.