Tuesday, June 24, 2025
Homeఆంధ్రప్రదేశ్చింతూరు ఆదివాసీ చైతన్య ర్యాలీ జూన్ 18న జయప్రదం చేయండి

చింతూరు ఆదివాసీ చైతన్య ర్యాలీ జూన్ 18న జయప్రదం చేయండి

Listen to this article

చింతూరు ఆదివాసీ జేఏసీ మండల కార్యదర్శి కాక సీతారామయ్య

పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ జూన్ 16

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం చింతూరు ఐ. టి. డి. ఏ. ముందు 33వ రోజు రిలే నిరాహార దీక్షను చింతూరు మండల జేఏసీ కార్యదర్శి కాక సీతారామయ్య పూలమాలు వేసి దీక్షను ప్రారంభించారు. అలాగే ఈ దీక్షను ఉద్దేశించి మాట్లాడుతూ షెడ్యూల్ ఏరియా ఉద్యోగ నియామకాల చట్టం సాధన కోసం చేస్తున్న ఉద్యమంలో ఇంకా యువత ముందుకు రావాలి! రిలే నిరాహార దీక్షలు నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఈ బుధవారం జూన్ 18 న నాలుగు మండలాల నిరుద్యోగులు, యువతీ యువకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ ఆదివాసి చైతన్య ర్యాలీని శాంతియుతంగా చేయాలని ఆయన అన్నారు. ఈ నాలుగు మండలాల్లో ఉన్నటువంటి చదువుకున్న నిరుద్యోగులు ఇంకనైనా మేలుకోవాలని అలాగే మన చట్టాలపై మన గ్రామాల్లో అవగాహన కల్పించాలని ఆయన అన్నారు.మన పిల్లల భవిష్యత్ కోసం ఆదివాసీ మన జాతి మనగడం కోసం నెల రోజులపాటు చింతూరు ఐటీడీఏ ముందు రిలే నిరాహార దీక్ష నిరంతరం కొనసాగిస్తూ ఉన్నటువంటి ఉద్యమం ఈనాటి యువతరానికి ఆదర్శంగా ఉంటుంది, గ్రామాలలో పల్లెల్లో ఆదివాసీ చట్టాలపై ప్రతి ఒక్క గ్రామంలో అవగాహన కల్పించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆదివాసి జేఏసీ మండల కార్యదర్శి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోతనపల్లి నిరుద్యోగులు మడవి చరణ్, మడివి జ్యోతి, కారం చందు, మడివి సాయి సందీప్, మడివి శ్రీజ, మడకం దివ్య, రవ్వ ప్రసాద్, సొంది రాజు, k. దుర్గారావు, కారం సంకురమ్మ, మడక్కం కిట్టమ్మ, మడకం లాలమ్మ, మడకం రామమ్మ, మడక్కం సంకురమ్మ, మడివి సంకురమ్మ, మడకం రాణి, మడకం శ్యామల, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments