Tuesday, August 19, 2025
Homeఆంధ్రప్రదేశ్చింతూరు ఏజెన్సీ గ్రామాల్లో రోడ్లు బ్లాక్ అవ్వడం వలన ఇబ్బంది పడుతున్న ప్రజానీకం

చింతూరు ఏజెన్సీ గ్రామాల్లో రోడ్లు బ్లాక్ అవ్వడం వలన ఇబ్బంది పడుతున్న ప్రజానీకం

Listen to this article

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 19

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు డివిజన్ పరిధిలో చింతూరు, వి.ఆర్ పురం, కూనవరం రోడ్లు బ్లాక్ అయి తీవ్ర అంతరాయం ఏర్పడింది, ఏజెన్సీ ప్రజానీకం అయ్యో మోయానికి గురి అవుతున్నారు, అలాగే లోతట్టు ప్రాంతాల గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని అలాగే ప్రజలకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని గ్రామాల్లోకి వెళ్లి ఏవైతే గ్రామాలు ముందస్తు మునిగిపోతాయో వాళ్లకి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించాలి అలాగే ఈ నాలుగు మండలాల్లో ఈ యొక్క వర్షా ప్రభావం ముందుగా గ్రత ఉంచుకొని ఎమర్జెన్సీ రూమ్స్,కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి రోడ్డు మార్గంలో ఎక్కడైతే ముందే మునిగిపోతుందో అక్కడ పడవ ఏర్పాటు చేయాలి, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ ముందస్తు చర్యలు చేపట్టాలి గ్రామాలలో గర్భిణీ స్త్రీలు ఉంటే వాళ్లని ముందుగానే ఏరియా హాస్పిటల్ లో చేర్పించాలి, చింతూరు టు మోటు రోడ్డు బ్లాక్ అయింది, చింతూరు టు విఆర్ పురం రోడ్డు బ్లాక్ అయ్యాయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడవలసి వస్తుంది రవాణాలేని గ్రామాలకు వెంటనే తక్షణ ఆర్థిక సహాయాలు చేయాలని ప్రజలు కోరుకుంటుంది, చూటూరు చీకటి వాగు బ్రిడ్జి డౌన్ లో బ్లాక్ అయ్యింది అలాగే సోకలేరు బ్రిడ్జి మునిగిపోయింది, అందువలన రవాణాకి తీవ్ర అంతరాయం కలిగింది ఈ నాలుగు మండలాలలో ఎక్కడైతే బాగా రవాణాకి ఇబ్బంది పడుతుందో అక్కడ మాత్రం ప్రయాణికులకి పడవ ఏర్పాటు చేయాలి పైన వస్తున్న వర్షానికి దిగువన బ్యాక్ వాటర్ వీలిన మండలాల్లో ప్రజలకు రోడ్డు మార్గలను ముంచి రాకపోకలను ప్రజలను తీవ్ర ఇబ్బంది కి గురిచేసింది. అలాగే ముంపు ప్రదేశాల్లో ప్రజలకు సురక్షితంగా రెవిన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ వారు, ఎక్కడైతే రోడ్డు మార్గంలో బ్లాక్ అయిందో అక్కడ డ్యూటీలు నిర్వహిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments