Saturday, June 7, 2025
HomeUncategorizedచింతూరు ఏర్రంపేట లోని నాన్ ట్రైబల్ అక్రమ కట్టడాలకు ఎటువంటి మినహాయింపు ఇవ్వొద్దు

చింతూరు ఏర్రంపేట లోని నాన్ ట్రైబల్ అక్రమ కట్టడాలకు ఎటువంటి మినహాయింపు ఇవ్వొద్దు

Listen to this article

చింతూరు తో పాటు చింతూరు డివిజన్లో గల v.r పురం, కూనవరం, ఎట్టపాక మండలాల్లోని గిరిజయేతరుల అక్రమాలు కూడా తక్షణమే కూల్చివేయాలి*

చింతూరు ఐటీడీఏ పి ఓ గారిని కోరిన ఆదివాసి సంక్షేమ పరిషత్
పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జి జూన్ 7 రోడ్డు వైండింగ్లో పోయే అక్రమ కట్టడాలలో 95% వలసగిరిజయేతరుల షాపులు ,ఇల్లులే ఎక్కువగా ఉన్నాయి. వాటిని తక్షణమే ఎటువంటి మినహాయింపు లేకుండా కూల్చివేయాలని ,అలాగే స్థానిక ఆదివాసులకు నష్టం జరిగితే ప్రభుత్వం ప్రత్యామ్నాయ న్యాయం చేయాలి అని, శనివారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ (274/16)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను ప్రకటన ద్వారా కోరారు.మైదాన ప్రాంతాల నుండి ఏజెన్సీ ప్రాంతాల్లోకి వలస వచ్చి , ఏదో ఆదివాసులకు అభివృద్ధి చేస్తున్నాము అని ముసుగు తొడుక్కొని , ఆదివాసి భూములు, ప్రభుత్వ భూములు కబ్జా చేసి, స్థానిక ఆదివాసులకే టోపీ పెడుతున్నారు. నాన్ ట్రైబల్ చేసే ప్రతి ఒక్క వ్యాపారులో బలయ్యేది ఆదివాసిలే !.. ఇలా చూసుకుంటే చాలా ఉన్నాయి. బయట వేరే ఊరు నుడి వలస వచ్చి ఇక్కడ ఏజెన్సీలో వ్యాపారాలు పెట్టుకొని అమాయకులైన ఆదివాసీల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు.. రూపాయి వడ్డీకి లేదా రెండు రూపాయల వడ్డీకి ప్లేన్ ఏరియా నుంచి తీసుకొని వచ్చి లక్షల్లో మన ఆదివాసి గుడాలల్లో పది రూపాయల వడ్డీకి , రోజువారి మరియు వారం వారి వడ్డీ వ్యాపారంచేస్తున్నారు.. వారం వారం వచ్చి డబ్బులు వసూలు చేసుకుని వెళ్తున్నారు. ఆదివాసులకి తెలియనిది ఏమిటంటే అవసరానికి డబ్బులు వస్తున్నాయి కదా వారం వారం కొంతే కడుతున్నాము కదా అని ఎక్కువగా మోసపోతున్నారు. నిజానికి ఏజెన్సీ ఏరియాలో 10 రూపాయలు వడ్డీకి వ్యాపారం చేయడం అనేది పూర్తిగా చట్ట వ్యతిరేకం. ఇది మనలో చాలామందికి తెలియక అవసరానికి డబ్బులు ఇస్తున్నారు మనం తర్వాత తీరుస్తున్నాము కదా అని దగా పోతున్నారు. ఇకనైనా మన ఆదివాసీలు ఐక్యంగా ఉండి మోసం నుండి మేల్కొని డబ్బులు ఒకరికి ఒకరు సాయపడుకుంటూ ముందుకు వెళ్తే ఈ అధిక వడ్డీ వ్యాపారాన్ని అణిచివేయొచ్చు.. అని ఆదివాసులకు హితవు పలికారు. అలాగే 1/70 చట్టం అమలు అనంతరం ఏజెన్సీకి వలస వచ్చిన(నాన్ ట్రైబల్)వాళ్లు ముఖ్యంగా చింతూరు ఏడుగురాళ్లపల్లి ఎటపాక కూనవరం విఆర్ పురం ప్రధాన సెంటర్లలో చిరు వ్యాపారం చేస్తామని ప్లేన్ ఏరియా నుండి ఇక్కడికి వచ్చి మొదట్లో చిన్నగా షాప్ పెట్టుకొని తర్వాత పక్కా భవనాలు, బహుళ అంతస్తు నిర్మాణాలు చేపట్టి వ్యాపారాలు చేయడమే కాకుండా అధిక అద్దెలకు ,అధిక (సుమారు ముందస్తుగా లక్ష రూపాయలు)అడ్వాన్సులకు మళ్లీ తిరిగి ఆదివాసులకే అద్దెకి ఇస్తున్నారు. అని ఆవేదన వ్యక్తపరిచారు. ప్రభుత్వ స్థలం లో అక్రమ కట్టడాలు కట్టి స్థానికంగా ఉన్న ప్రభుత్వ అధికారులకు కూడా అధిక రేట్లతో అద్దెలకు ఇవ్వడం అధికారులకు కూడా తెలుసు అని అన్నారు. ఆదివాసీలు ఒకవేళ వ్యాపారం పెట్టుకోవాలి అనుకుంటే సంబంధిత గ్రామపంచాయతీ దగ్గరికి వెళ్లి మనం వ్యాపారం చేసుకోవచ్చు. కానీ ఆదివాసులకు అవగాహన, ఐక్యత లేక వలన గిరిజన యే తరులకు మనలో కొంతమంది కొమ్ము కాయడం వలన ఈ రోజు ఆదివాసీలు నష్టపోతున్నారు, ఆదివాసి చట్టాలు నిర్వీర్యం అయిపోతున్నాయి ఆని ఆవేదన వ్యక్తపరిచారు.ఉదాహరణకు చింతూరు సెంటర్ చూసుకుంటే సెంటర్ మొదటి నుండి సెంటర్ ఎండింగ్ వరకు అన్ని గిరిజన యే తరుల షాపులే ఉన్నాయి.. ఒకటో రెండో ఆదివాసీల షాపులు ఉన్నాయి అవి కూడా ఎక్కడి నుంచో వలస వచ్చి ఇక్కడ భూమిని కబ్జా చేసి వాళ్ళ దగ్గర మనవాళ్లు అద్దెగా తీసుకొని ఉంటున్నారు.. ఈ రోడ్డు డివైడింగ్, మరియు అక్రమ కట్టడాల కూల్చివేత వలన అలాంటి అక్రమ కట్టడాలు ఎన్నో తొలగిపోతాయి. దీనిపై భయం పుట్టిన గిరిజన యేతరులకు అంగ బలం, డబ్బు బలం ,రాజకీయ పలుకుబడితో ఒకపక్క అధికార పార్టీ ఎమ్మెల్యే ని,. మరోపక్క ప్రతిపక్ష గిరిజన యేతర నాయకులతో రాజకీయం చేసి అక్రమ కట్టడాలు తొలగింపు ఆపే కుట్రలు చేస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా కుట్రలు చేసిన వారికి కుట్రలు చేసే వారికి సహకరించిన వారికి ఏజెన్సీలో భవిష్యత్తులో పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ఒకపక్క ఆదివాసి రిజర్వేషన్లు పోయి ఆదివాసులు ఉద్యమ బాట పట్టి ఆర్తనాధలు చేస్తుంటే కనీసం పలకరించని ఎమ్మెల్యేకి నాన్ ట్రైబల్ అక్రమాలు కూలుస్తూ ఉన్నారు అనగానే వారిపై ఎక్కడలేని ప్రేమతో అటు ప్రభుత్వం తోటి ఇటు అధికారులతోటి మాట్లాడుతూ అక్రమ కట్టడాల కూల్చివేతకు అడ్డుపడాలని ప్రయత్నించడం సిగ్గుచేటు అని, ఇటువంటి ప్రజాప్రతినిధులు ఆదివాసులకు ఉండటం ఆదివాసుల దౌర్భాగ్యం అని ఆయన మండిపడ్డారు .చింతూరు మండలం తో పాటు చింతూరు డివిజన్లో గల vr. పురం, కూనవరం, ఎటపాక మండలంలో గల అక్రమ కట్టడాలను తక్షణమే కూల్చివేయాలని చింతూరు ఐటీడీఏ పిఓ గారికి ఫిర్యాదు అందించినట్లు తెలియజేశారు. ఆదివాసులు ఇకనైనా మేల్కొని నాన్ ట్రైబల్ మోసాలకు గురికాకుండా వాళ్లకి బినామీలుగా ఉండకుండా అధికారులు చేస్తున్నటువంటి అక్రమ కట్టడాల తొలగింపుకు అండదండలుగా నిలవాలని ఆయన కోరారు. లేకపోతే భవిష్యత్ తరాలకు ఇప్పుడు తరం ఆదివాసులంతా చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ఇప్పటికే ఆదివాసి ప్రజాప్రతినిధులు నాన్ ట్రైబల్ కొమ్ముకాస్తూ వాళ్లు ఆడిచ్చినట్టు ఆడుతున్నారని కనీసం ఆదివాసీల అయినా స్వతగా మేల్కొని ఐక్యమై మన ఏజెన్సీ భూభాగాన్ని రక్షించుకుంటే అన్ని రాజ్యాంగ పలాలు మనమే పొందవచ్చు అని ఆయన తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments