Friday, June 13, 2025
Homeఆంధ్రప్రదేశ్చింతూరు ఐటీడీఏ ముందు 27 వ రోజు రిలే నిరాహార దీక్షను ప్రారంభించిన ఎర్రంపేట గ్రామ...

చింతూరు ఐటీడీఏ ముందు 27 వ రోజు రిలే నిరాహార దీక్షను ప్రారంభించిన ఎర్రంపేట గ్రామ పూజారి మడివి రాజ

Listen to this article

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూన్ 1

అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,చింతూరు ఐటీడీఏ ఎదుట 27వ,రోజు రిలే నిరాహార దీక్షలు కార్యక్రమానికి ఎర్రం పేట, గ్రామ యువతి,యువకులు రిలే నిరాహార దీక్షలలో పాల్గొన్న వారికి ఎర్రం పేట గ్రామ పూజారి పూలమాల వేసి ప్రారంభించారు.ఈ రిలే నిరాహార దీక్షలను ఉద్దేశించి మాట్లాడుతూ…2025 జనరల్ డీఎస్సీ నుండి షెడ్యూల్డ్ ప్రాంత ఆదివాసీ టీచర్స్ పోస్టులు మినహాయించి,యుద్ధ ప్రాతిపదికన 100% స్థానిక ఆదివాసీ పట్టభద్రులతోనే భర్తీ చేసేందుకు ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్స్ విడుదల చేయాలని,తక్షణమే (టిఏసి)ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసి తీర్మానం చేసి షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం ప్రకటించాలని,జీవో నెంబర్ 3కు చట్ట బద్ధత కల్పిస్తామని ఎన్నికల ముందు అరకులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలు చేయాలని,వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఎస్టి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ విడుదల చేయాలని,ఐటిడిఏల ద్వారా ట్రైకార్ రుణాలు నిరుద్యోగ యువతకు తక్షణమే మంజూరు చేసి ఉపాధి కల్పించాలని మొదలైన సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ తలపెట్టిన రిలే నిరాహార దీక్షలకు ప్రతి గ్రామాన ఉన్న యువత తరలి రావాలి అని పిలుపు ఇచ్చారుఅనంతరం ఆదివాసీ జేఏసీ రాష్ట్రా కార్యదర్శి కుంజా అనిల్ మాట్లాడుతూ మాట్లాడుతూ…ఆదివాసీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం భారత రాజ్యాంగంలోని ఐదవ ఆరవ షెడ్యూల్డ్ లోని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 244(1) ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం పేరా -4 ప్రకారం (టిఎసి) ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ కమిటీ ఏర్పాటు చేసి తక్షణమే తీర్మానం చేసి షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం ప్రకటించి ఆదివాసీ నిరుద్యోగ పట్టవద్రుల భవిష్యత్తును కాపాడాలని టీఎస్ కమిటీ ప్రజా ప్రతినిధులకు, మరియు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారుఈ కార్యక్రమం లో డివిజన్ జేఏసీ చైర్మన్ జల్లి.నరేష్ ఈ రిలే నిరాహార దీక్షలు కారం చందు, పాండ్రు. సరస్వతి,పార్వతి పాండ్రు డాలని,శ్యామల సౌజన్యసవలం.భద్రయ్య,అంజి,మీడియం.కొండయ్య,కారం.శంకురమ్మ, మొదలైన వారు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments