

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్
అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతూరు డివిజన్ చింతూరు, మార్చి 21: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం మొదటి వార్షికోత్సవం మరియు తృతీయ సంవత్సరం విద్యార్థినీ,విద్యార్థులకు వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా చింతూరు గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ మరియు సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, గౌరవ అతిథిగా చింతూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ షేక్.నాగుల్ మీరా విచ్చేశారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైనది. సభకు అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ డాక్టర్.కె రత్న మాణిక్యం మాట్లాడుతూ కళాశాల ప్రారంభమైనప్పటి నుండి కళాశాలలో అందుబాటులో ఉన్న కోర్సులు, కళాశాల అభివృద్ధిని వివరించారు. కళాశాల అభివృద్ధికి అవసరమైన అదనపు స్థలం కొరకు కృషి చేస్తున్న చింతూరు ఐ.టి.డి.ఏ పి.ఓ, డీ.ఎఫ్.ఓ, ఎఫ్.ఆర్.ఓ, చింతూరు తహసిల్దార్ తదితరులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇటీవల ప్రధానమంత్రి ఉచ్చితార్ శిక్ష అభియాన్ నుండి మంజూరైన రూ. 5 కోట్లు సంబంధించిన వివరనాత్మక ప్రాజెక్టు నివేదికను సమర్పించి, పరిపా
