Sunday, June 15, 2025
Homeఆంధ్రప్రదేశ్చిన్న పిల్లలకు ఉచిత వైద్య శిబిరం

చిన్న పిల్లలకు ఉచిత వైద్య శిబిరం

Listen to this article

ఆదరణ ఫౌండేషన్ రాందేవ్ ఆసుపత్రి సంయుక్తంగా వైద్య శిబిరం

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 15 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

విశేష ఆదరణతో హర్షం వ్యక్తం చేసిన పిల్లల తల్లిదండ్రులు

సమాజానికి నిస్వార్థంగా సేవలు అందించడంలో రాందేవ్ ఆస్పత్రి ముందుంటుందని రాందేవ్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ యోబు అన్నారు. ఆదివారం ఆదన ఆదరణ ఫౌండేషన్ (స్వచ్ఛంద సంస్థ) సహకారంతో రాందేవ్ ఆసుపత్రిలో ఒకటి నుండి పదహారు సంవత్సరాల లోపు పిల్లలకు ఉచితంగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరాన్ని రాందేవ్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కమలాకర్, డాక్టర్ లక్ష్మీ కమలాకర్ లో అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న పిల్లలకు జనరల్ స్క్రీనింగ్, ఐ చెకప్, ఇతర వ్యాధులను గుర్తించడానికి రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ యోబు మాట్లాడుతూ చిరుప్రాయంలోనే పిల్లలకు ఎలాంటి రోగాలు రాకుండా ఉండడానికి వైద్య శిబిరంలో పలు పరీక్షలు నిర్వహించి పిల్లలకు రోగాల పట్ల అప్రమత్తత ఉండడానికి డాక్టర్లచే పలు సూచనలు చేయించడం జరిగిందన్నారు. పిల్లల వైద్య శిబిరానికి ఆదరణ ఫౌండేషన్ సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆదరణ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ అరగెల రఘునాథ్ బాబు మాట్లాడుతూ రాందేవ్ ఆస్పత్రి వైద్యరంగంలో అందిస్తున్న సేవలు అద్భుతం అని కొనియాడారు. ఈ వైద్య శిబిరంలో రాందేవ్ హాస్పటల్ డాక్టర్ సునీత, డాటర్ శృతి, డాక్టర్ మణి, డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ సుమిత్ర, కల్పన మంతెన, లీలా సృజన లు వైద్య సేవలందించారు. కార్యక్రమంలో ఆదరణ ఫౌండేషన్ కోశాధికారి భాను వర కుమార్, ప్రధాన కార్యదర్శి పి మేరీ జోన్స్, ఎ. అనిషా, ఎ. సన్నీ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments