
పయనించే సూర్యుడు జూన్ 8 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మండల ప్రజలకు బక్రీదు శుభాకాంక్షలు తెలిపిన మండల టిడిపి అధ్యక్షులు షేక్.సిరాజుద్దీన్ చేజర్ల మండల కేంద్రంలో బక్రీదు పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు ఘనంగా ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం నుంచే ముస్లిం సోదరులు ఈద్గా హాజరయ్యారు. ముస్లింల పవిత్ర పండుగ అయిన ఈదుల్ అజ్హా బక్రీదు త్యాగానికి ప్రతీకగా జరుపుకుంటారని మౌలానా తన ప్రసంగంలో వివరించారు. అల్లాహ్ పరంగా హజ్రత్ ఇబ్రాహీం చేసిన త్యాగాన్ని స్మరించుకునే ఈ పండుగ ప్రతి ఒక్కరికి మానవతా విలువలను గుర్తు చేస్తుందని చెప్పారు.ఈ సందర్భంగా చేజర్ల మండల టీడీపీ అధ్యక్షుడు షేక్ సిరాజుద్దీన్ హాజరై పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మండల ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని. సమాజంలో సానుభూతి. సోదరభావం పెరగాలని ఆకాంక్షించారు.ప్రార్ధనల అనంతరం ముస్లింలు పరస్పరంగా ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు పంచుకున్నారు. పండుగ శోభను ఆస్వాదిస్తూ చిన్న పిల్లలు నుంచి వృద్ధులు వరకు అందరూ ఉల్లాసంగా. ఆనందంగా గడిపారు. సంఘ సౌభ్రాతృత్వానికి, ఐక్యతకు ఈ పండుగ చిహ్నంగా నిలిచింది ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు