Friday, June 6, 2025
Homeఆంధ్రప్రదేశ్చేజర్ల పెద్ద చెరువు ఆధునికరణ పనులు ప్రారంభం

చేజర్ల పెద్ద చెరువు ఆధునికరణ పనులు ప్రారంభం

Listen to this article

పయనించే సూర్యుడు జూన్ 6 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)

ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలతో,ఆత్మకూరు నియోజకవర్గం సీనియర్ టిడిపి నాయకులు కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు సూచనల మేరకు చేజర్ల మండలంలోని పెద్ద చెరువు గ్రామ కొలను ఆధునికీకరణ పనులు గురువారం ప్రారంభ చేయడం జరిగింది
సుమారు రూ.1.20 కోట్లు గ్రాంట్‌తో ఈ అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా చెరువు కట్ట ఆధునికరణ తో, అలుగుల నిర్మాణం,సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు,వాకింగ్ ట్రాక్ అభివృద్ధి,పంటకాలువలు . వూటి కాలువల నిర్మాణ పనులు జరుగనున్నాయి.ఈ అభివృద్ధి పనులతో స్థానికులకు నీటి వినియోగంలో మెరుగుదలతో పాటు,పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే విధంగా చెరువు ప్రాంతం ఆకర్షణీయంగా మారనుంది.ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా టిడిపి పార్లమెంటరీ సెక్రటరీ రావి పెంచల రెడ్డి,చేజర్ల మండల టిడిపి కన్వీనర్ షేక్ సిరాజుద్దీన్,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రావి లక్ష్మీ నరసారెడ్డి,సోమశిల దక్షిణ కాలువ చైర్మన్ రావి ప్రసాద్ రెడ్డి,చేజర్ల చెరువు చైర్మన్ అరవ గోపిరెడ్డి,లాయర్ చుండి కిష్టారెడ్డి,దొడ్డం రెడ్డి హజరత్ రెడ్డి,ఎంపీటీసీ మస్తాన్,నెల్లూరు సుబ్బారెడ్డి,మైనార్టీ నాయకులు షేక్ సుభాని,షేక్ నజీర్,బురగళ్ళ రాధాకృష్ణ ఉడత.పెంచలయ్య,ఇరిగేషన్ జే.ఈ యాసిన్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments