
ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజ నరసింహ
కార్యక్రమంలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
( పయనించే సూర్యుడు జూన్ 25 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ప్రతి సంవత్సరం బోనాలకు ముందు ఏర్పాటు చేసే చేతివృత్తుల మేళాలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సహకారంతో నేడు తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రక్కన 30 స్టాళ్లతో ఏర్పాటు చేసిన బిసి చేతి కులవృత్తుల వస్తువుల ప్రదర్శన, అమ్మకాలను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు మల్లు భట్టి విక్రమార్క, ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్య క్రీడలు మరియు యువజన శాఖ మంత్రి వర్యులు డా”వాకిటి శ్రీహరి, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ , ఎమ్మెల్యేలు మరియు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
