
మక్తల్ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు dr. మణికంఠ గౌడ్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ
//పయనించే సూర్యుడు// న్యూస్ జూన్ 3//మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప//
మక్తల్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మక్తల్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మక్తల్ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు dr. మణికంఠ గౌడ్ పార్టీ కార్యాలయంలో భరతమాత, తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్, గాంధీజీ,అంబేద్కర్ చిత్రపటాలకు పూల మాలలు సమర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తదనంతరం రాష్ట్ర గీత ఆలాపన చేసి అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన అమరవీరులను స్మరిస్తూ 2 నిముషాలు మౌనం పాటించి అమరులకు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా dr.మణికంఠ గౌడ్ మాట్లాడుతూ : తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఎప్పటికీ మర్చిపోలేని చరిత్ర. ఈ గొప్ప తెలంగాణ రాష్ట్రం ఎన్నో త్యాగాలు, కష్టసుఖాల మధ్య నిర్మాణం పొందిందని తెలిపారు.ఆ పోరాటం ప్రజల ఐక్యతకు సాక్ష్యం. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేయాలన్న దృక్పథం జనసేన పార్టీకి ఎల్లపుడు ఉంది అని అన్నారు.అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు అని మణికంఠ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం ప్రతి సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గళం విప్పారు. భవిష్యత్తులో జనసేన పార్టీ తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతోంది. అనడంలో ఎటువంటి సందేహం లేదని తెలిపారు. ఈ విషయంలో మన నేత పవన్ కళ్యాణ్ మార్గనిర్దేశనం మనకు బలాన్ని ఇస్తోంది,” అని స్పష్టం చేశారు. మక్తల్ లో జనసేన కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా పార్టీ నిర్మాణం అతి త్వరలో జరుగుతోంది. ప్రతి కార్యకర్తకు గౌరవం ఉండేలా, ప్రజల సమస్యలపై పోరాటం చేసేలా జనసేన తర్వలోనే బలంగా ఎదుగుతుంది దానికి సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే మొదలైందని ” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మక్తల్ నియోజకవర్గం సీనియర్ నాయకులు హన్మంత్, గౌడి బాలిరెడ్డి, రామన్ గౌడ్, శ్రీను, కార్యకర్తలు భీమేష్, శివ, శివలింగం, ఉమేష్, పర్శరాములు, నర్సిములు, కృష్ణ, తదితరులు పాల్గొని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరిపారు.
