Monday, February 24, 2025
Homeఆంధ్రప్రదేశ్జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి

జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి

Listen to this article

టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు లొట్టి శ్రీను ఆధ్వర్యంలో

//పయనించే సూర్యుడు// న్యూస్// ఫిబ్రవరి 25// నారాయణపేట/ మక్తల్ నారాయణపేట జిల్లాలో మీడియాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు వెంటనే ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర యూనియన్ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు జర్నలిస్టుల సమస్యలపై కలెక్టర్ సిక్త పట్నాయక్ కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ నారాయణపేట జిల్లా అధ్యక్షులు లొట్టి శ్రీను మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల సమస్యలపై స్పందించి వెంటనే సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు.
రాష్ట్రంలో జర్నలిస్టులపై జరిగిన దాడులపై దాడులను అరికట్టాలని , ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వెంటనే ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని అన్నారు. మహిళా జర్నలిస్టులకు పనిచేసే కార్యాలయాల నుంచి ఇంటి వరకు రాత్రిపూట రవాణా సదుపాయం కల్పించాలని విన్నవించారు. అలాగే ఇతర రాష్ట్రాల మాదిరిగా జర్నలిస్టులకు పెన్షన్ విధానం కూడా అమలు చేయాలని తెలిపారు. అక్రిడిటెషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి టి. మాధవ్, జాతీయ కౌన్సిల్ సభ్యులు యాదయ్య, స్టేట్ కౌన్సిల్ సభ్యులు నారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు నర్సింలు, కోశాధికారి లింగం, టిబిజెఎ జిల్లా అధ్యక్షులు ఎజాజ్ సోఫీ, మోహన్ రాజ్, శివ, ఇమామ్, బాల్ రాజ్, కేవీ. నరసింహ, వి. శ్రీనివాసులు, ఏ. ఆంజనేయులు, వై. నర్సింలు, ఆనంద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments