
పయనించే సూర్యుడు: మే 26: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి.ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ధర్మవరం,అయ్యవారిపేట, ఉప ఆరోగ్య కేంద్రంలో సోమవారం జాతీయ అయోడిన్ లోప రుగ్మత కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భగా హెచ్ఈఓ వేణు గోపాలకృష్ణ ఈయొక్క కార్యక్రమంలో పాల్గొని జాతీయ కార్యక్రమాలు అమలులో భాగంగా ధర్మవరం ఉప కేంద్రం లో గల అయ్యవారిపేట గ్రామంలోనీ 50 కుటుంబాలకు ఉప్పు పరీక్ష కిట్ ద్వారా పరీక్షలునిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు మనము తయారు చేసుకునే ఆహారంలో ఉప్పును వేస్తూ ఉంటా మని, ప్రతి మనిషికి తన దయానందిన జీవితంలో ప్రతి దినము ఉప్పు కలిపిన ఆహార పదార్థాలు వాడుతూ ఉంటాడని, ఈ ఉప్పు అనునది ఎక్కువైనా ఆరోగ్య సమస్యలు వస్తాయనీ, తక్కువైన ఆరోగ్య సమస్యలు వస్తాయనీ తెలియజేశారు.ఉప్పులో అయోడిన్ లేకపోవటం వలన గర్భవ తుల్లో గర్భవిచ్చినము లేక నెలలు నిండకముందే పిల్లల్ని కనుట లేక తక్కువ బరువు తో బిడ్డ కనుట, పుట్టిన పిల్లలకు బుద్ధిమాంద్యం వచ్చుట, థైరాయిడ్ సమస్యలు వచ్చుట , గాయిటర్ అనే రుగ్మత వచ్చుట,జరుగుతాయని తెలిపారు. ఒక సాధారణ ఆరోగ్యవంతమైన మానవుడు ప్రతిరోజు ఐదు గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలనీ ఈ సందర్భంగా తెలియజేశారు. జాతీయ ఆరోగ్య కార్య క్రమాల అమలులో భాగంగా మనము ప్రతిరోజు వాడే ఉప్పులో అయోడిన్ ఉన్నది లేనిది తెలుసుకొనుటకు ఉప్పు పరీక్ష కిట్టు ద్వారా అయోడిన్ ఉన్నదా లేదా తెలుసుకొనుట జరిగినదనీ,అలాగే అయోడిన్ యొక్క ఆవశ్యకత గురించి ప్రజలకువివరించారు. ఈయొక్క కార్యక్రమంలో హెచ్ఈఓ,వేణుగోపాలకృష్ణ, ఎఎన్ఎమ్,శారద, మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
