
అఖిల భారత పిలుపుమేరకు జిల్లావ్యాప్తంగా PHC, సబ్ సెంటర్ల ముందు నిరసనలు తెలియజేసిన ఆశ వర్కర్లు.
పయనించే సూర్యుడు// న్యూస్// మార్చ్ 22// //మక్తల్. రిపోర్టర్ సి. తిమ్మప్ప //
దేశ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం జాతీయ ఆరోగ్య మిషన్ పథకాన్ని రెగ్యులరైజ్ చేసి ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 26 వేల రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని నారాయణపేట జిల్లా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గోవింద్ రాజ్ , కర్ని పి హెచ్ సి అధ్యక్షురాలు యశోద, ఇందిరా, అమీనా బేగం డిమాండ్ చేశారు. శుక్రవారం రోజు మక్తల్ మండలంలోని కర్ని పి.హెచ్.సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ప్లే కార్డ్స్ పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు . నిరసన కార్యక్రమంలో ఆశలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆశ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AWFFI) ఆద్వర్యంలో జాతీయ స్థాయిలో ఆందోళనలు చేస్తున్నామన్నారు. 45వ మరియు 46వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసుల ప్రకారం పెన్షన్ సామాజిక భద్రత ప్రయోజనాలను ఆశా కార్యకర్తలు కల్పించాలన్నారు. కరోనా కట్టడిలో ఆశ కార్యకర్తలు తగిన రక్షణ కవచాలు లేకున్నా తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ ప్రజల ప్రాణాలను కాపాడినారన్నారు.
అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆశా కార్యాకర్తలను గ్లోబల్ లీడర్ గా గుర్తించిందన్నారు .జాతీయ ఆరోగ్యం మీషన్( NHM) పరిధిలో దేశ వ్యాప్త 10 లక్షలు 9 వేల మంది ఆశలు పనిచేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ హెచ్ ఎం జాతీయ ఆరోగ్య మిషన్(NHM)ను శాశ్వత ఆరోగ్య కార్యక్రమం పథకంగా మార్చాలని డిమాండ్ చేశారు . దేశ వ్యాప్తంగా ఒకే విధమైన పని పరిస్థితులను అమలులోకి తీసుకురావాలన్నారు. వేతనంతో కూడుకున్న ప్రసూతి సెలవులు 20 రోజుల క్యాజువల్ లీవులు వైద్య సెలవులు అమలు చేయాలన్నారు. సీనియార్టీ ప్రకారం ఆశలను ఏఎన్ఎంలుగా పదోన్నతి కల్పించాలని కోరారు.
అనంతరం వివిధ డిమాండ్లతో కూడుకున్న అవినీతిపత్రం కర్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ తిరుపతి గారికి వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ నాయకులు అనిత, సుజాత,, అనురాధ, యు సావిత్రమ్మ, రాజేశ్వరి, ఆశ కళావతి, పుష్ప రవీంద్రమ్మ, తదితరులు పాల్గొన్నారు
