Saturday, May 31, 2025
Homeఆంధ్రప్రదేశ్జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం నిర్వహణ.

జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం నిర్వహణ.

Listen to this article

పయనించే సూర్యుడు: మే30: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి.ఎ.

వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని చెరుకూరు ఉపకేంద్రంలో గల శ్రీరాంనగర్, చెరుకూరు,ములకలపల్లి గ్రామాలతో పాటు ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని గ్రామాలలో వర్షాకాలం మొదలైన కారణంగా యుద్ధ ప్రాతిపదికన కీటక జనత వ్యాధుల ప్రభావం పెరిగే అవకాశాలు ఉన్నందున ముందస్తు జాగ్రత్తలచర్యలలో భాగంగా,లార్వా నియంత్రణ కార్యక్రమం (ఎ.ఎల్.ఒ.యాంటీ లార్వల్ ఆపరేషన్) ద్వారా దోమల పుట్టుకను అరికట్టుటకు దోమలు తన సంతతిని అభివృద్ధి చేసుకొనుటకు లేక ఉత్పత్తి చేసుకొనుటకు నిలువ నీరు ఉన్న ప్రాంతాలు ఆవాసాలుగా ఉపయోగపడతాయి కాబట్టి, నిల్వ నీరు ఉన్న ప్రదేశాలలో లేక ప్రాంతాలలో దోమలు గుడ్లు పెట్టి లార్వాదశలోకి మారి ఏడు రోజుల తర్వాత ప్రౌఢ దశ దోమగా లేక రెక్కలు వచ్చిన దోమగా తయారై పైకి ఎగర కలుగుతుంది కనుక, దోమలను అరికట్టుటకు లార్వాదశలోనే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి మంగళవారం మరియు ప్రతి శుక్రవారం ప్రతి కుటుంబ సభ్యులు తమ నిత్యవసరాలకు వాడే నీరు మరియు వర్షం రావడం వల్ల ఏర్పడిన నిలువ నీరు ఇంటి పరిసరాల్లో ఉన్నాయా లేదా పరిశీలించి దోమలు పుట్టకుండా చేయుటలో వైద్యారోగ్య శాఖతో పాటు ప్రజల తోడ్పాటు సహకారం అవసరమని ఆయా గ్రామాల ప్రజలకి తెలియజేయడం జరిగినదనీ హెచ్.ఇ.ఓ వేణు గోపాలకృష్ణ తెలియజేసారు. ఈయొక్కకార్యక్రమంలో, హెచ్ఈ.ఓ.వేణుగోపాలకృష్ణ, ఎ ఎన్ ఎమ్ శ్రీదేవి, హెచ్.ఏ. జయంత్ లాల్, తిరుపతి, ఎ.ఎన్.ఎమ్.సుమలత, రాజ్యలక్ష్మి ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments