Saturday, June 28, 2025
Homeఆంధ్రప్రదేశ్జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించండి…

జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించండి…

Listen to this article

పయనించే సూర్యుడు// జూన్//29: మక్తల్

జిల్లా సమాగ్రాభివృద్ధికి అధిక నిధులుకేటాయించి జిల్లా అభివృద్ధికి పూనుకోవాలని పశుసంవర్ధక ,డైరీ అభివృద్ది,యువజన మరియు మత్స్యకార్మిక శాఖ మంత్రి వాకిటి శ్రీహారిని తన నివాసంలో సిపియం జిల్లా నాయకత్వం మర్యాదపూర్వకంగా కలిసి భగత్ సింగ్ జీవిత చరిత్ర పుస్తాకాన్ని అందజేశారు. అనంతరం వినతి పత్రం అందజేశారు . ఈ సందర్భంగా సిపియం జిల్లా కార్యదర్శి జి వెంకట్రామారెడ్డి మాట్లాడుతూ వాకిటి శ్రీహారి మంత్రి అయినందుకు సంతోశాన్ని వ్యక్తం చేశారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ క్రింద భూములు కోల్పోతున్న రైతులకు 2013 చట్ట ప్రకారం మార్కెట్ రేట్ కు అదనంగా మూడురేట్లు కలిపి ఇచ్చి ప్రాజెక్ట్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు.జిల్లా సమగ్రాభివృద్ధి, విద్యా,వైద్యం తో పాటు జిల్లాలోని వాగులపై చెక్ డ్యామ్ ల నిర్మాణం చేపట్టాలని అన్నారు,జిల్లా కేంద్రం అభివృద్ధికి 500కోట్లు నిధులు కేటాయించాలని కోరారు. సిపియం జిల్లా నాయకులు గోపాల్ ,అంజిలయ్య ,ఆంజనేయులు, గోవింద్ రాజ్ ,భారత్,నరహింహా,మహేష్ కుమార్,శ్రీకాంత్ తదితరులు మంత్రి ని సన్మానించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments