
పయనించే సూర్యుడు: జూన్ 12: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి. ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలో గత సంవత్సరంలో మూతపడి ఉన్న జీరో స్ట్రెంత్ పాఠశాలను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పాయపట్లను సందర్శించి, గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించి వెంటనే పాఠశాల ప్రారంభానికి సహకరించాలని కోరారు.విద్యార్థుల తల్లిదండ్రులు మరియు వాజేడు ఎంపీడీవో శ్రీకాంత్ సహకారంతో తిరిగి ప్రారంభించాలని సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు, అర్షం రాజు, గుల్లపెల్లి సాంబయ్య, ఉచిత పాఠ్య పుస్తకాల జిల్లా మేనేజర్ అప్పని జయదేవ్ మరియు స్థానిక మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా కోరారని తెలియజేశారు.
