Sunday, July 6, 2025
Homeతెలంగాణజూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని వాల్ పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది

జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని వాల్ పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది

Listen to this article

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్తెలంగాణ నిజాంబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోతెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టి యు సి ఐ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని దేశాయ్ బీడీ కంపెనీలో జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని వాల్ పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టి యు సి ఐ) రాష్ట్ర కార్యదర్శి ఎం ముత్తెన్న మాట్లాడుతూ కార్మికులు సాధించుకున్నటువంటి 44 చట్టాలను మోడీ ప్రభుత్వం 15 చట్టాలను తీసివేసి 26 చట్టాలను నాలుగు కోడ్స్ గా తీసుకువచ్చి కార్మికులను కట్టు బానిసలుగా చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు అదేవిధంగా కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేయాలని కనీస వేతనం 26000 అమలు చేయాలని కోరారు సంఘటిత అసంఘటిత కార్మికులకు నెలకు కనీస పెన్షన్ 9000 ఇవ్వాలని పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని ఎన్ పి ఎస్ ను రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటికరణ ఆపాలని వారు డిమాండ్ చేశారు ఉపాధి హామీ కూలీలకు 600 కూలి చెల్లించాలని సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని వారు కోరారు కాబట్టి ఈ సమ్మెను విజయవంతం చేయడం కోసం కార్మికులు కర్షకులు మేధావులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నజీర్ , తూర్పాటి శ్రీనివాస్ నిమ్మల నిఖిల్ గంగాధర్ రవి రాజేశ్వర్ రాజేందర్ వినయ్ విక్రమ్ రమేష్ పెద్దన్న అశోక్ నారాయణ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments