
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూన్ 28 చింతూరు
మండలంలో ఉన్న జిసిసి హమాలీ కార్మికుల సమావేశానికి ముఖ్య అతిథులుగా రంపచోడవరం సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిసిసి అమాలి కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి కార్మికులందరికీ ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు అమలు చేయాలి.దేశంలో మూడవసారి అధికారంలోకి బిజెపి వచ్చిన తర్వాత ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ కరణ ఆపాలి. విశాఖ స్టీల్ ని ప్రైవేట్ కాలనీ ఆపాలి విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కాంటాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వం కూడా కార్మికులఎనిమిది గంటల పని దినాన్ని పెంచుతూ రాష్ట్రంలో ఉన్న కార్మికులు 12 గంటలు 14 గంటలు వరకు పని చేయాలని రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించడం చాలా దుర్మార్గం ఇది కార్మికుల ప్రభుత్వం కాదు పెట్టుబడుదారులకు కోసమే పని చేస్తుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోజు రోజుకు దిగజారి పోతున్నయి. కేంద్ర ప్రభుత్వం కార్మికులకి అనుకూలంగా ఉన్న చట్టాలని కూడా రద్దు చేయాలని చూస్తుంది. బ్రిటిష్ కాలం నుండి పోరాటం చేసి కార్మికులు ఎన్నో చట్టం సాధిస్తే ఇప్పుడున్న బిజెపి ప్రభుత్వం మాత్రం చట్టాలన్ని రద్దు చేయడానికి చూస్తున్నది కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి కార్మికుల పైన రుద్దాలని చూస్తున్నది. కార్మికులకి కనీస వేతనం అమలు చేయడం లేదు. సమాన పనికి సమాన వేతనం. సంక్షేమ పథకాలు అమలు చేయాలి. కార్మికులకి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలి. కార్మికుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలని అన్నారు. కార్మిక చట్టాలు హక్కులు కాపాడుకోవడానికి జులై 9న దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో దేశంలో ఉన్నటువంటి కార్మికుల లోకం మొత్తం కూడా ఆ రోజు సమ్మెలో పాల్గొనాలని అన్నారు. ఈ సమావేశంలో సిఐటియు మండల కార్యదర్శి పొడియం లక్ష్మణ్ . జిసిసి హమాలీ కార్మికులు స్వామి. చంద్రయ్య. దూలయ్య. రాజయ్య. తదితరులు పాల్గొన్నారు