PS Telugu News
Epaper

జోగులాంబ గద్వాల జిల్లా లో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం.

Listen to this article

పయనించే సూర్యుడు తేదీ 4 నవంబర్ జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న.

అల్లంపూర్ మండలం క్యాతుర్లు పిఎసిఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన
అల్లంపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప గారు వైస్ చైర్మన్ పచర్ల కుమార్ గారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఉద్దేశంతో ప్రతి రైతు నష్టపోకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రైతులు అమ్ముకొని లబ్ధి చేకూరాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం సంకల్పించింది కనుక రైతులందరూ ప్రభుత్వం నిర్ణయించిన సెంటర్లకు వెళ్లి అమ్ముకోవాలని మొక్కజొన్నలు క్వింటాలు 2400 రూపాయలు చెల్లిస్తుంది మరియు పత్తి రైతులు కూడా నష్టపోకుండా అల్లంపూర్ చౌరస్తా దగ్గరలో శ్రీ సిద్ధి వినాయక కాటన్ మిల్ నందు ప్రభుత్వం క్వింటాలు 8100 కొనుగోలు చేస్తున్నారు కావురా రైతులందరూ గమనించి ప్రభుత్వ నిబంధన ప్రకారం పండించిన పంట ఆమ్ముకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో సింగల్ విండో అధ్యక్షుడు రాఘవరెడ్డి మార్క్ఫెడ్ డిఎం మరియు కాంగ్రెస్ నాయకులు భీమవరం చంద్రశేఖర్ రెడ్డి ఊట్కూరు నరసన్ గౌడ్ క్యాతూర్ మద్దిలేటి బైరాపురం రమణ క్యాతురు నరేంద్ర తదితరులు పాల్గొన్నారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top