
పయనించేసూర్యుడు న్యూస్( జూన్.05/06/2025/) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యుగంధర్
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరుంచుకుని తిరుపతి జిల్లా తడ మండలంలోని మాంబట్టు పారిశ్రామిక వాడ నందు వున్న టాటా కెమికల్స్ కంపెనీ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో టాటా యాజమాన్యం తో పాటు సమీప గ్రామంలో గల విలేజ్ లెర్నింగ్ సెంటర్ విద్యార్థులు పాల్గొన్నారు,సైట్ సేఫ్టీ హెడ్ బాషా మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యతను, ఈ సంవత్సరం సిద్ధాంతం బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి అందరికీ వివరంగా తెలియచేశి, సైట్ హెడ్ రవి హోసూరు, అడ్మిన్ హెడ్ వరలక్ష్మిలచే ఈ సంవత్సరానికి సంబందించిన ప్లాగ్ ని ఆవిష్కరించడం జరిగింది….అనంతరం విలేజ్ లెర్నింగ్ సెంటర్ విద్యార్థినిచే పర్యావరణ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు.. అందరూ కలిసి కంపెనీ నందు దాదాపు 100 చెట్లు నాటడం జరిగింది…ఈ కార్యక్రమం లో టాటా ప్రతినిధులతో పాటు విలేజ్ లెర్నింగ్ సెంటర్ విద్యార్డులు పాల్గొన్నారు…