
పయనించే సూర్యుడు మే 20 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి: టేకులపల్లి మండలం టిడిపి మండల అధ్యక్షుడిగా గుడిపూడి మోహన్ రావు ఏకగ్రీవ ఎన్నిక. మంగళవారం టేకులపల్లి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర పరిశీలకులు ఎండి ఇమామ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ తరఫున గుడిపూడి మోహన్ రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా నలమాస శంకర్, ప్రధాన కార్యదర్శిగా గజ్జల రామ్ శేఖర్, కోలుకూరి రవిశంకర్, కార్యనిర్వాహక కార్యదర్శులు ఆంగోత్ చందులాల్, మసిపాక రామస్వామి, నెల్లూరి శ్రీను, కార్యదర్శులు జర్పుల గణేష్, జాటోత్ శిరీష్, కోశాధికారి రామారావులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.