PS Telugu News
Epaper

టీచర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు పెనుగంచిప్రోలు తహసిల్దార్ కార్యాలయం వద్ద నడుస్తున్న వ్యక్తం చేసిన జిల్లా నాయకులు శేట్టిపోగు.రాము

Listen to this article

పయనించే సూర్యుడు రిపోర్టర్ సెప్టెంబర్ 13ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు

పెనుగంచిప్రోలు గ్రామంలో ని ఈరోజున తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా నిరసన వ్యక్తం చేసిన జిల్లా నాయకులు శేట్టీపొగు రాము ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు పెనుగంచిప్రోలు తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది నిరసన ప్రదర్శనలో రాష్ట్రకౌన్సిలర్ శెట్టిపోగు రాము మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డీఏ కూడా ప్రకటించకపోవడం విచారకరమని అన్నారు ఇప్పటివరకు నాలుగు డి ఎ లు పెండింగ్లో ఉన్నాయని,2003 జూలైలో రావలసిన పి.ఆర్.సి నేటి వరకు కమిషన్ ను నియమించకపోవడం, అదేవిధంగా గత పిఆర్సి కు సంబంధించిన బకాయిలు, డీఎ. బకాయిలు,వెంటనే చెల్లించాలని కోరారు అదేవిధంగా ఉపాధ్యాయులకు ఉద్యోగులకు 25 లక్షల రూపాయల ఆరోగ్య భీమా సదుపాయాన్ని కల్పించాలని ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా ఏర్పాటు చేసిన అసెస్మెంట్ బుక్ విధానం ఆ శాస్త్రీయమని అసెస్మెంట్ బుక్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు పై న్యాయమే డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని లేకపోతే భవిష్యత్తులో కలిసి వచ్చే సంఘాలతో కలుపుకొని పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు శెట్టిపోగు రాము ప్రధాన కార్యదర్శి గిరి రవి ఉపాధ్యక్షులు శ్రీనివాస నాయక్ గౌరవ అధ్యక్షులు నాగరాజు, ముమ్మటీ కిషోర్ మండలంలోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.*

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top