PS Telugu News
Epaper

ట్యూషన్‌కి వెళ్లిన బాలికకు ఘోరం – తల్లిదండ్రులు షాక్!

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మరో దారుణం చోటు చేసుకుంది. డమ్ డమ్ ప్రాంతంలో మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. కమలాపూర్ బాలికల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థినిని బలవంతంగా టోటో (ఈ-రిక్షా)లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. మైనర్ బాలిక స్నేహితుడు సహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోల్‌కతా పోలీసులు ఆదివారం నిందితులను బారక్‌పూర్ కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు వారిని విచారణ నిమిత్తం పోలీసు కస్టడీకి అప్పగించింది. బాధితురాలు శనివారం (నవంబర్ 1) ట్యూషన్ కోసం తన సైకిల్‌పై బయలుదేరింది. తనకు తెలిసిన యువకుడిని కలిసిన తర్వాత, ఇద్దరూ కమలాపూర్ పార్క్‌లో కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత, ఆ యువకుడు, అతని ఇద్దరు స్నేహితులు ఆమెను బలవంతంగా . టోటోలోకి తీసుకెళ్లి మోతీలాల్ కాలనీలోని హరిజన్ కాలనీలోని ఒక గదికి తీసుకెళ్లారు. ముగ్గురు యువకులు దారుణానికి పాల్పడ్డారు. ఇక్కడ, ముగ్గురు యువకులు మైనర్‌పై దారుణంగా దాడి చేశారు. నిందితులు విక్కీ పాశ్వాన్, రాజేష్ పాశ్వాన్, సంజు సాహా ఆ ప్రాంత నివాసితులు. ఆ రాత్రి ఆమె అనారోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ రాత్రి డమ్ డమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. బాధితురాలికి ఆదివారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇదిలావుంటే, ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ క్యాంపస్‌లో ఒక యువ వైద్యుడి మరణం పశ్చిమ బెంగాల్ అంతటా విస్తృత నిరసనలకు దారితీసింది. అదికాస్తా రాజకీయ మలుపు తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతిపక్ష బిజెపి పార్టీ అధికార తృణమూల్ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రూరమైన సంఘటన తరువాత పోలీసుల తీరుపై దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని పెల్లుబిక్కింది. తరువాత సిబిఐ ఈ కేసును దర్యాప్తు ప్రారంభించింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top