Saturday, May 31, 2025
Homeఆంధ్రప్రదేశ్డాక్టర్ కలాల్ మణికంఠ గౌడ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో స్వచ్చంధంగా భారీగా చేరిన చిట్యాల గ్రామ...

డాక్టర్ కలాల్ మణికంఠ గౌడ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో స్వచ్చంధంగా భారీగా చేరిన చిట్యాల గ్రామ యువకులు

Listen to this article

రోజు రోజూ కు బలేపేతమౌతున్న మక్తల్ జనసేన పార్టీ

పయనించే సూర్యుడు// న్యూస్ మే 30//మక్తల్ రిపోర్టర్ సీ తిమ్మప్ప//

ఈ రోజు జనసేన పార్టీ ఉపాధ్యక్షులు టీ టీ డి బోర్డ్ మెంబెర్*
మహేందర్ రెడ్డి , తెలంగాణ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గార్ల ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని మక్తల్ మండలం చిట్యాల గ్రామానికి చెందిన నితిన్ కమ్మరి శ్రీనివాస్ మరియు నర్సింహా ఆహ్వానం మేరకు వెళ్లిన డాక్టర్ కలల్ మణికంఠ గౌడ్ మరియు నియోజకవర్గం సీనియర్ నాయకులు హనుమంతు,రామన్ గౌడ్ ,గౌడి బాల్ రెడ్డి, శివ, భీమేష్ ,పరుశురాం,మొదట స్టానిక శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం లో పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి, నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు డాక్టర్ మణికంఠ గౌడ్ నేతృత్వంలో మక్తల్ మండలం , చిట్యాల గ్రామకు చెందిన నితిన్ కమ్మరి శ్రీనివాస్ మరియు నర్సింహా చొరవతో 40 మంది యువకులకు జనసేన పార్టీ కండువా కప్పి సాధారంగా వారిని పార్టీ లోకి స్వాగతించడం జరిగింది. తదనంతరం డాక్టర్ కలల్ మణికంఠగౌడ్ మాట్లాడుతూ భవిష్యత్ లో తెలంగాణ లో జనసేన పార్టీ ఎనలేని శక్తి గా ఎదిగి ప్రభుత్వ స్థాపన దిశగా అడుగులేస్తోంది అని, చిట్యాల యువకులు జనసేన పార్టీ కి మద్దతుగా పార్టీ లో చేరినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పార్టీలో తగిన స్థానం కల్పిస్తామని, జనసేన పార్టీ స్థానిక ప్రజల యొక్క వివిధ సమస్యలపైన పోరాటాలు చేస్తూ పూర్తిస్థాయిలో సమస్యలను పరిష్కారం చూపే విధంగా ప్రజలకి మీ ద్వారా నమ్మకం, భరోసా ఇవ్వాలని తెలిపారు మరియు రానున్న స్థానిక ఎన్నికలలో జనసేన పార్టీ మన మక్తల్ నియోజక వర్గం లో కూడా సత్తా చాటలని తెలిపారు. కొత్తగా పార్టీ లో చేరిన వారు నరేష్, నరసింహ, దత్తు, రాములు, నితిన్, అశోక, రాజు, పర్శరాములు, అంజి, అనిల్, మంజునాథ్, సునీల్, m.నర్సింహా, మహిబుబ్ అలీ,వెంకటేష్,బాలరాజ్, రమేష్, పవన్, తదితరులు. ఈ కార్యక్రమం లో మక్తల్ నియోజకవర్గం సీనియర్ నాయకులు హన్మంత్, గౌడి బాల్ రెడ్డి, రామన్ గౌడ్,భీమేష్, శ్రీను, శివ,పర్శరాములు, నర్సింహా తదితరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments