Thursday, June 26, 2025
Homeఆంధ్రప్రదేశ్డిగ్రీ కళాశాల ఏర్పాటు పై కమిటీ స్థల పరిశీలన

డిగ్రీ కళాశాల ఏర్పాటు పై కమిటీ స్థల పరిశీలన

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్(జూన్.25/06/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యుగంధర్

కడప రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ (ఎఫ్ ఏ సి) వారి ఆదేశాల మేరకు డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కమిటీ వరదయ్యపాలెం సందర్శించారు.అర్జీదారు (ఎన్టీఆర్ వెంకయ్య) విజ్ఞప్తితో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో, రెండవసారి డిగ్రీ కాలేజ్ ఏర్పాటు కమిటీ వరదయ్యపాలెం రావడం విశేషం.శ్రీకాళహస్తి ఎస్ వి ఏ ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై నాగరాజు నాయుడు, సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి సుజాత, శ్రీకాళహస్తి ఎస్వీఏ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే నరసింహ వర్మ కమిటీ గా వరదయ్యపాలెం సందర్శించారు. ఈ క్రమంలో వరదయ్యపాలెం జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రఘుపతి తో కలసి స్థలం పరిశీలించారు.డిగ్రీ కళాశాలకు అనుకూలంగా ఉన్నట్టు, నివేదికన ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్ న్యూస్ రిపోర్టర్ కతారి ప్రశాంత్ తో పాటు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments