
పయనించే సూర్యుడు న్యూస్ జూలై 28 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
మీ భూమిని మీకు తెలియకుండా ఇతరుల పేరు మీదికి మారిస్తే విల్లేజ్ రెవిన్యూ ఆఫీసర్, మండల్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ మండల సర్వేయర్, తహసిల్దార్ సెక్షన్ 197 సీఆర్పీసి ప్రకారం నేరస్తులు అవుతారు.రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు విషయంలో ఒక్కరి భూమి మరొక్కరి ఒన్ బి ఆడంగల్ మంజూరు చేస్తే ఆడంగల్ మరియు ఒన్ బి కరెక్షన్ కోసం రైతులు ఆర్ ఒ ఆర్ చట్టం కింద రెవిన్యూ డివిజనల్ అధికారి దగ్గర అప్పీల్ గాని, జాయింట్ కలెక్టర్ దగ్గరకు గాని అప్పీల్ వెళ్ళవలసిన అవసరం లేదు.సంబంధిత తహసిల్దార్ కి అర్జీ పెట్టుకోవాలి మీ భూమి పత్రాలు చూపించి ఆ అర్జీకి జిరాక్స్ జతపరచాలి మీతో విచారణ చేయకుండా మీ భూమిని ఇతరులకు ఆన్లైన్ నందు ఒన్ బి, ఆడంగల్, పట్టాదారు పసుపుస్తకం మంజూరు చేసినందుకు గాను విల్లేజ్ రెవిన్యూ ఆఫీసర్, మండల్ రెవిన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్, తహసిల్దార్ సెక్షన్ 197 సీఆర్పీసి ప్రకారం నేరస్తులు అవుతారు.వీరి మీద చర్యలు తీసుకోమని పై అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు పై అధికారులు చర్యలు తీసుకొనకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు క్రిమిల్ అప్పీల్ చట్టం.