
( పయనించే సూర్యుడు జూన్ 16 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామపంచాయతీ లోని చింతగట్టు తండాలో ఈరోజు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పెద్దలు ఎల్లారం శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. చింతగట్టు తండా నుండి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే దాదాపు 20 మంది విద్యార్థులకు సిద్దాపూర్ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థులు స్కూలుకు వెళ్లడానికి బస్సు మార్గం లేకపోవడంతో ఎల్లారం శేఖర్ రెడ్డి తన సొంత ఖర్చుతో పిల్లల కోసం ఒక ప్రత్యేక స్కూల్ వాహనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు వడ్డే వెంకటయ్య, అంజయ్య, ఖయ్యుం ,గౌరీ గణేష్ జనార్దన్ చారి, యాదయ్య హరికృష్ణ, బాలు నాయక్, బాసు నాయక్ పులియా మరియు తండా యువత మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
