
పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన మండపంలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో హైదరాబాద్ చిన్నారుల కూచిపూడి నృత్యం పలువురుని ఆకట్టుకుంది. తిరుపతిలోని హిందూ ధర్మ ప్రచార పరిషత్ సౌజన్యంతో అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ ఆస్థాన మండపంలో చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ నృత్య ప్రదర్శనలో నగరంలోని హైదర్ నగర్ రుహని కూచిపూడి నృత్య అకాడమీ నిర్వాహకురాలు నేరెళ్ల కల్పన ఆధ్వర్యంలో చిన్నారులు నృత్య ప్రదర్శనలో పాల్గొన్నారు. చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శనలో బిందు మాధవి, భావనలతో పాటు పలువురు చిన్నారుల నృత్య ప్రదర్శన ప్రేక్షకులను అలరింపజేసింది. ఈ సందర్భంగా రుహని కూచిపూడి నృత్య అకాడమీ నిర్వాహకురాలు నేరెళ్ల కల్పన మాట్లాడుతూ రుహని కూచిపూడి అకాడమీలో కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకున్న చిన్నారులు తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన మండపంలో కూచిపూడి నృత్య ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. కూచిపూడి నృత్య ప్రదర్శనలో అకాడమీ చిన్నారులు అద్భుతమైన ప్రదర్శన చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారన్నారు. ఈ ప్రదర్శనలో చిన్నారుల తల్లిదండ్రులు, అకాడమీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
