Monday, October 27, 2025
HomeUncategorizedతుఫాన్ కారణంగా ప్రజల అప్రమత్తుగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు

తుఫాన్ కారణంగా ప్రజల అప్రమత్తుగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు

Listen to this article

పయనించే సూర్యుడు అక్టోబర్ 27 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )

ప్రస్తుతము బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారి సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో అధిక వర్షపాతం నమోదు కావచ్చునని వాతావరణ శాఖ వారు హెచ్చరించియున్నారు.✓అందుపై సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో నివసించుచున్న ప్రజలు అప్రమత్తంగా ఉండవలెనని ముఖ్యముగా లోతట్టు ప్రాంతాల్లో నివసించుచున్న ప్రజలు అత్యవసర పరిస్థితులలో తప్ప బయటికి వెళ్ళరాదని తెలియజేయడమైనది.✓సూళ్లూరుపేట పట్టణ ప్రజలు అత్యవసర పరిస్థితులలో పురపాలక సంఘం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ : 08623-295456 నకు సహాయం కొరకు 24X7 సంప్రదించవచ్చునని తెలియజేయడమైనది.✓అత్యవసర పరిస్థితులలో సహాయక చర్యలు చేపట్టుటకు స్పెషల్ టీములను ఏర్పాటు చేయడమైనది.✓ పురప్రజలకు పురపాలక మరియు వార్డు సచివాలయ సిబ్బంది 24×7 అందుబాటులో ఉండునని, ఏదైనా అత్యవసర సహాయము కొరకు 24X7 సంప్రదించవచ్చునని తెలియజేయడమైనది.✓అదేవిధంగా వర్షాభావ పరిస్థితుల వలన సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా కాచి చల్లార్చిన నీటిని తాగవలసిందిగా తెలియజేయడమైనది.ఇట్లు కమీషనర్, సూళ్లూరుపేట పురపాలక సంఘము

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments