Friday, June 20, 2025
Homeఆంధ్రప్రదేశ్తెలంగాణ ఉద్యమ నేత ఎం సుదర్శన్ రావు సేవలు మరువలేనివి…మండలి విపక్ష నేత ఎస్ మధుసూదనాచారి

తెలంగాణ ఉద్యమ నేత ఎం సుదర్శన్ రావు సేవలు మరువలేనివి…మండలి విపక్ష నేత ఎస్ మధుసూదనాచారి

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 20 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ ఉద్యమ నేత ఎం సుదర్శన్ రావు సేవలు చిరస్మరణీయమని మండలి విపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి అన్నారు. ఏం సుదర్శన్ రావు జయంతి సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గం లో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏం సుదర్శన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితిలో ఏం సుదర్శన్ రావు కీలక భూమిక పోషించారని అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం కృషి చేసిన ఎం సుదర్శన్ రావు ఎంతోమంది నాయకులకు ఆదర్శనీయమని కొనియాడారు. ఎమ్మెల్సీ కురుమయ్యగారి ఎమ్మెల్సీ నవీన్ రావు, వడ్డేపల్లి రాజేశ్వరరావు, ప్రముఖ సంఘ సేవకులు కురుమయ్యగారి కొండలరావు, ఎం అభిలాష్ రావు, బిజెపి కోరుట్ల ఇన్చార్జ్ సురభి నవీన్ రావ్, కపిల్ రాజు, గజ్జల నగేష్, పి రఘునందన్ నేత, రామ్మోహన్ రావు, దుర్గారావు, దేవేందర్రావు, డి భాస్కర్ రెడ్డి, కన్నయ్య ,బిక్షపతి, మాచర్ల భద్రయ్య, సిహెచ్ అనిల్, లక్ష్మణ్, ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments