
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ
పయనించే సూర్యుడు మే నిజామాబాద్ జిల్లా బ్యూరో టికె గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా లో వచ్చే నెల జూన్ రెండో తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా చైర్మన్ తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ, మాజీ ప్రభుత్వ విప్ అనిల్ కుమార్ ఈరవత్రి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెండవ తేదీన సోమ వారం టీజీఎండిసి చైర్మన్ శ్రీ అనిల్ కుమార్ ఈరవత్రి జాతీయ జెండా ఆవిష్కరించి ..పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు. తెలంగాణ అమరుల ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నారు.