Saturday, June 7, 2025
Homeఆంధ్రప్రదేశ్తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకావిష్కరణ...

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకావిష్కరణ చేయడం జరిగింది.

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్

• తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. • రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో మహిళా సంఘాలకు పెట్రోలు బంకులు, మహిళా శక్తి క్యాంటీన్లు, శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్ళను ప్రభుత్వం ప్రారంభించింది. • అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల కాలంలో 25 లక్షల 35 వేల 964 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం. రైతుభరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నాం. రుణమాఫీ ఈ పథకం ద్వారా నిజామాబాద్ జిల్లాలో మొత్తం 1,00,612 మంది రైతుల పంట రుణాలు 782.31 కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది. • దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. కులగణన నిర్వహించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. • అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. • భూ పరిపాలనలో పారదర్శకత, భద్రత, ప్రజలకు సులభమైన సేవలు అందించే దిశగా భూ భారతి చట్టం ఏప్రిల్ 14 2025 న అమలులోకి వచ్చింది. భూ సంబంధిత సమస్యలు గ్రామస్థాయిలోనే పరిష్కరించే ఉద్దేశంతో ప్రభుత్వం ఏప్రిల్ 17 నుంచి 30 వరకు జిల్లాలో అన్ని మండల కేంద్రాలలో అవగాహన సదస్సులు నిర్వహించింది. మన జిల్లాలో మెండోర మండలం పైలెట్గా ఎంపిక చేయబడింది. మే 5 నుంచి 8 వరకు జరిగిన సదస్సుల్లో 706 దరఖాస్తులు అందగా, అందులో 369 పరిష్కరించదగ్గవిగా గుర్తించబడ్డాయి అందులో విచారణ అనంతరం 72 ఆమోదించబడ్డాయి, 133తిరస్కరించబడ్డాయి, 104 విచారణలో ఉన్నాయి. • నిజామాబాద్ జిల్లాలో గత జనవరి 2025 నుండి ఇప్పటి వరకు 1,551 కొత్త ఆహార భద్రత కార్డులు మంజూరు చేయడం జరిగింది. 1,13,288 మంది కొత్త యూనిట్లను రేషన్ కార్డులలో చేర్చడం • మహా లక్ష్మి పథకం నిజామాబాద్ జిల్లాలో 2,42,710 గ్యాస్ వినియోగదారులకు 10,19,994 సిలిండర్లకు సబ్సిడీ విడుదల చేసి మొత్తం రూ. 30.73 కోట్లు. 3.59 కోట్ల మంది మహిళా ప్రయాణీకులు ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు, దీని వలన జిల్లా మహిళలకు రూ. 145.06 కోట్లు ఆదా అయింది. సగటున ప్రతిరోజు 0.98 లక్షల మంది మహిళా ప్రయాణీకులు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. • 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకం కింద నిజామాబాద్ జిల్లాలో మార్చి-2024 నుండి మే-2025 వరకు 2,51,632 కుటుంబాలకు ప్రతి నెల జీరో బిల్లులు జారీ చేయడం జరుగింది. ఈ పథకం కింద ఇప్పటివరకూ ప్రభుత్వం 142.86 కోట్ల రూపాయల సబ్సిడీని అందజేసింది. • ఇందిరా గిరివికాస పథకం క్రింద ఏప్రిల్-2025 వరకు 78 మంది లబ్దిదారులకు వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ సౌకర్యం కల్పించడం జరిగింది. • 2,50,337 మంది చేయూత పింఛనుదారులకు వృద్ధాప్య, వితంతు, చేనేతకార్మికుల, గీతకార్మికుల, బీడీ కార్మికుల జీవనభృతి, ఒంటరి మహిళల జీవనభృతి, బీడీ టెకేదారుల జీవనభృతి, పైలేరియా, డయాలసిస్ మరియు ఏయిడ్స్ వ్యాదిగ్రస్తులకు నెలవారి పింఛను రూ. 2,016, 18,615 మంది వికలాంగులకు నెలవారి పింఛను రూ. 4,016 చెల్లించడము జరుగుచున్నది. • గల్ఫ్ దేశాలకు ఉపాది కోసం వెళ్లి మరణించిన 55 గల్ఫ్ బాదితుల ఒక్కొక్క కుటుంబానికి రూ. 5 లక్షలను ఎక్స్ గ్రేషియా చొప్పున మొత్తం రూ. 2 కోట్ల 75 లక్షలను వారి ఖాతాలలో జమ చేయడం జరిగింది. • నిజామాబాద్ జిల్లా 2024-25 పదవ తరగతి పరీక్షలలో 96.62% ఉత్తీర్ణత సాధించింది. ZPHS డొంకేశ్వర్ పాటశాల విద్యార్ధి అత్యధికమార్కులు (586) సాదించి రాష్ట్రములోనే మొదటి స్థానములో నిలిచింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments