
మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారులను ఘనంగా సన్మానించిన వై. అంజయ్య యాదవ్
( పయనించే సూర్యుడు జూన్ 2 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల పాత్ర వెలకట్టలేనిదని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ కొనియాడారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మలి విడత ఉద్యమకారులను ఘనంగా సన్మానించిన అనంతరం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పడిన టిఆర్ఎస్ పార్టీకీ అండగా ఉంటూ ఆనాటి నుంచి రాష్ట్రాన్ని సాధించేవరకు వేలాది మంది ఉద్యమకారులు రాష్ట్ర సాధన కోసం తమ వంతుగా కృషి చేశారని గుర్తు చేశారు. ముఖ్యంగా మన ప్రాంతంలో సామాన్య ప్రజల నుంచి మేధావుల వరకు అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో పాల్గొని తమదైన పాత్రను పోషించారు. ఉద్యమంలో భాగంగా కొందరు జైలుకు వెళ్లారని, పోలీసులు కేసులు పెట్టారని, సీమాంధ్రలో బెదిరింపులకు దిగిన భయపడకుండా రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు చేసిన పోరాటం తీరు నేటి యువతకు ఆదర్శనీయమని గుర్తు చేశారు. సకల జనుల సహకారంతో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఇందులో ఉద్యమకారులు మొదటి వరుసలో ఉంటారని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ మార్కెట్ చైర్మన్ వంకాయల నారాయణరెడ్డి, మన్నే కవిత నారాయణ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, మాజీ గ్రంధాలయ చైర్మన్ లక్ష్మీనరసింహా రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
