Saturday, June 14, 2025
Homeఆంధ్రప్రదేశ్దేశినేని హనుమంతరావు సంతాప సభ మరియు దశదిన కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన...

దేశినేని హనుమంతరావు సంతాప సభ మరియు దశదిన కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే నాగరాజు

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నలబై ఆరవ డివిజన్ పరిధిలోని రాంపూర్ గ్రామానికి చెందిన దేశినేని అచ్యుత్ తండ్రి గారైన దేశినేని హనుమంతరావు ఇటీవల అనారోగ్యంతో మరణించగా నేడు వినాయక కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించిన సంతాప సభ మరియు దశదిన కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, టెస్కాబ్ ఛైర్మన్ మార్నెనీ రవీందర్ రావు, నగర మేయర్ గుండు సుధారాణి తో కలిసి పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు
అనంతరం సంతాప సభలో ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ హనుమంతరావు కి నేను పోలీస్ అధికారిగా పనిచేసే సమయంలో మంచి సన్నిహిత సంబంధం మంచి మనిషి అందరిని కలుపుగోలుగా ఎవరితో భేదాభిప్రాయాలు లేకుండా జీవించిన వ్యక్తి మన హనుమంతరావు ని వారి లేని లోటు తీర్చడం చాలా కష్టమని ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్ధించిన ఎమ్మెల్యే నాగరాజు
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు నాయకులు, బంధువులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments