
(సూర్యుడు సెప్టెంబర్ 2 రాజేష్)
నేరాలను నియంత్రించడంలో, నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల కీలక పాత్ర వహిస్తాయి
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చు
నేరరహిత సమాజానికి సీసీ కెమెరాలు చాలా ముఖ్యం
ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం
ప్రజలకు భద్రత, సెన్సాఫ్ ఆఫ్ సెక్యూరిటీ కలిగించడంలో సీసీ కెమెరాలు చాలా ముఖ్యం
నేరాలను నియంత్రించడంలో మరియు నేరస్తులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర వహిస్తాయి
సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వ్యాపారస్తులను వివిధ సంఘాల నాయకులను ప్రజా ప్రతినిధులను అభినందించారు
పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ మేడమ్ గారు
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మేడమ్ గారు మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఉన్న వ్యాపారస్తులు ప్రజాప్రతినిధులు, అభినందించారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలో ముఖ్యమైన చౌరస్తాలలో మరియు ఎంట్రీ, ఎగ్జిట్ 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నేరాలను నియంత్రించడంలో నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల కీలక పాత్ర వహిస్తాయి, సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చు, నేరరహిత సమాజానికి సీసీ కెమెరాలు చాలా ముఖ్యం, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం, ప్రజలకు భద్రత, సెన్సాఫ్ ఆఫ్ సెక్యూరిటీ కలిగించడంలో సీసీ కెమెరాలు చాలా ముఖ్యం,నేరాలను నియంత్రించడంలో మరియు నేరస్తులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర వహిస్తాయి, సీసీ కెమెరాలు 24 గంటల నిరంతరం పనిచేస్తాయని తెలిపారు. జిల్లాలో నేరాల అదుపు చేయడానికి పోలీసులతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు భాగస్వామ్యం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.సీసీ కెమెరాలు ఉన్న ఇండ్లలో కాలనీలలో గ్రామాలలో నేరస్తులు నేరం చేయడానికి భయపడతారని తెలిపారు. ప్రస్తుతం అధునాతన టెక్నాలజీ అందుబాటులో ఉన్నందున ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అందుకు గ్రామస్తులు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని సూచించారు. సిద్దిపేట జిల్లాలో సీసీ కెమెరాలు ఉండి పనిచేయని సిసి కెమెరాలు విషయంలో మరియు నూతన సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ప్రజాప్రతినిధులు వ్యాపారస్తులు పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు. ప్రజలు కూడా ఇంటి ఆవరణలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామాలలో పట్టణాలలో ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు జియోట్యాగింగ్ ద్వారా సిద్దిపేట కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేసే తర్వాత హైదరాబాద్ కమాండ్ కంట్రోల్స్ సెంటర్ కు అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా షాపుల యజమానులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని ఒక కెమెరా రోడ్డు వైపు పెట్టుకోవాలని సూచించారు. వ్యాపారస్తులు ఎన్నో లక్షల డబ్బులు ఖర్చు పెట్టి షాపులు పెడతారు 20 నుండి 30 వేల రూపాయలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు. ఏదైనా జరగరాని సంఘటన జరిగినా దొంగతనం జరిగిన నేరస్తులను పట్టుకోవడం సులభతరం అవుతుందన్నారు. ఫైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో యువకులు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని తెలిపారు.గంజాయి ఇతర మత్తుపదార్థాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.దౌల్తాబాద్ బస్టాండును ఎస్ఐ అరుణ్ చుట్టుపక్కల ఉన్న పిచ్చి మొక్కలను తీసివేసి, బస్టాండ్ ఆవరణంలో ఎత్తు పల్లాలు లేకుండా మొరం పోయించినాడు, మరియు బాత్రూమ్స్ లైటింగ్ నీటుగా చేయించడం వల్ల ఇప్పుడు బస్సులు వచ్చి పోతున్నాయి బస్టాండ్ ను సందర్శించి సందర్శించిన పోలీస్ కమిషనర్ ఎస్ఐ ని అభినందించారు గ్రామపంచాయతీ ఆవరణలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలతో కాసేపు సరదాగా గడిపి వారికి అందిస్తున్న ఫుడ్ మెనూ అడిగి తెలుసుకున్నారు.దౌల్తాబాద్ మండల కేంద్రంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపాన్ని సందర్శించారు ఆనందోత్సవాల మధ్య వినాయక నిమజ్జనం కార్యక్రమం నిర్వహించుకోవాలని యూత్ సభ్యులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏసిపి నరసింహులు, తొగుట సిఐ లతీఫ్, దౌల్తాబాద్ ఎస్ఐ అరుణ్ కుమార్, తొగుట ఎస్ఐ రవికాంత్ రావు, మాజీ సర్పంచ్ వేణుగోపాల్, మాజీ జెడ్పిటిసి భూపాల్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు భద్రయ్య, రాములు, అశోక్, లాల్, రమేష్, నరసింహారెడ్డి, ఎల్లయ్య మరియు దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఉన్న వ్యాపారస్తులు, ప్రజలు ప్రజాప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.కమిషనర్ కార్యాలయం నుండి జారీ చేయనైనది.
