
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూన్ 25
బుధవారం చట్టి గ్రామ పంచాయతీ జె వద్ద సర్పంచ్ శ్రీమతి రవ్వ భద్రమ్మ అధ్యక్షతన “ధర్తీ ఆబా జంజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ (డిఎజెజియు)గా పిలవబడే” మరియు”పి యమ్ జన్ మన్” గ్రామ సభ నిర్వహించారు. దీనిలో గిరిజన-మెజారిటీ గ్రామాలలో సమగ్ర అభివృద్ధిని పెంపొందించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర కార్యక్రమాలు,పథకాలు. గిరిజన వర్గాలకు స్థిరమైన మరియు సమగ్ర వృద్ధిని నిర్ధారించడం, మౌలిక సదుపాయాలు మరియు సామాజిక-ఆర్థిక అంతరాలను తగ్గించడం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి తెలియజేశారు. అర్హులైన గిరిజనుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ కార్యక్రమానికి ఈడి పల్లి మెడికల్ ఆఫీసర్ ప్రసన్న విచ్చేసి కేంద్ర ప్రభుత్వ హెల్త్ స్కీమ్స్ గురించి గ్రామస్థులకు అవగాహన కల్పించారు, కార్యక్రమం లో చట్టి గ్రామ పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ ఆలీ, వి ఆర్ ఓ సుజాత సచివాలయ సిబ్బంది. అగ్రికల్చర్ అసిస్టెంట్ – రవితేజ, వెల్ఫేర్ అసిస్టెంట్ – లక్ష్మణ్, వెటర్నరీ అసిస్టెంట్ – గోపాల్, ఏయన్ యమ్ – రాజ్యలక్ష్మి ప్రజలకు వారి శాఖ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు, ఈ గ్రామసభ లో ప్రజా ప్రతినిధులు, పెసా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ముత్తయ్య మరియు రామకృష్ణ , పంచాయతీ సిబ్బంది, అంగన్వాడి, ఆశా, డ్వాక్రా యానిమేటర్లు, యమ్ జి యన్ ఆర్ ఇ జి యస్ శ్రామికులు, ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారు …