
పయనించే సూర్యుడు; జూన్ 10: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి.ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని ధర్మవరం గ్రామంలో మంగళవారం ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు. ఈయొక్క కార్యక్రమంలో ముఖ్యంగా వర్షాకాలంలో మరియు వాతావరణ ప్రభావం వలన గ్రామాలలో కలిగే వ్యాధులను అంచనా వేయుటకు వ్యాధి తీవ్రత అంచనా వేయుటకు మరియు గుర్తించుట కొరకు పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ధర్మవరం ఉపకేంద్రం లోని ధర్మవరం గ్రామంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరం నందు 40 మంది ప్రజలకు వివిధ రకములైన వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స చేయడం జరిగినదనీ తెలిపారు. అనంతరం వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి ప్రజలకు వివరించి, ఇంటింటికి సందర్శన చేసి జ్వర పీడుతులు ఎవరైనా ఉన్నారా అని వివరాలు సేకరించి ఇంటి పరిసర ప్రాంతాల్లో నిల్వ నీరు ఉంటే వాటి వలన దోమలు తనసంతతిని ఉత్పత్తి చేసుకుంటాయని తెలియ జేస్తూ,ఆ నీటిని పారవేస్తూ, ఆ నీటిలో ఆయిల్ బాలు వేస్తూ,
దోమలు పుట్టకుండా నివారణ చర్యలు పాటిస్తూ దోమలు కుట్టకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ మలేరియా డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేయడం జరిగినది తెలిపారు. అంతేకాకుండా కాచి చల్లార్చిన నీళ్లు త్రాగవలెనని వేడి వేడి ఆహార పదార్థాలు మాత్రమే ప్రతిరోజు తీసుకోవాలని దోమతెరలు వాడాలని ఇంటికి తలుపులకు, కిటికీలకు దోమలు ఇంటి లోపలికి రాకుండా దోమల మెస్సులు వాడాలని సూచించారు. ఈయొక్క కార్యక్రమంలో ధర్మవరం ఉపకేంద్రం ఏఎన్ఎం.శ్రీదేవి, శారద,హెల్త్ అసిస్టెంట్ శ్రీను, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

